Tollywood Heroine: 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ కి సిద్ధం.. లుక్ చూస్తే షాక్..!

Tollywood Heroine.. ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత సక్సెస్ అయ్యి వరుస అవకాశాలు వస్తే చాలామంది ఫామ్ లో ఉంటారు. లేకపోతే ఒకటి రెండు సినిమాలకే దూరమవుతారు. కానీ నటించాలనే కోరిక వారిని మళ్లీ ఇండస్ట్రీలోకి వచ్చేలా చేస్తుంది. అయితే అలా వచ్చే క్రమంలో గుర్తుపట్టలేనంతగా మారిపోయి అభిమానులను ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి వారిలో ఒక టాలీవుడ్ హీరోయిన్ దాదాపు 13 సంవత్సరాల తర్వాత సినీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఆలోచిస్తోంది. అయితే ఆమె రీ ఎంట్రీ లో భాగంగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయి, అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు ఈమెను చూసిన తర్వాత నెటిజన్లు , ఆఖరికి అభిమానులు కూడా రకరకాల ట్రోల్స్ చేయడంతో ఇన్ స్టా అకౌంట్ ని కూడా దెబ్బకు క్లోజ్ చేసిందని సమాచారం. మరి ఆమె ఎవరు? ఏంటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

Tollywood Heroine: Ready for re-entry after 13 years.. Shocking to see the look..!
Tollywood Heroine: Ready for re-entry after 13 years.. Shocking to see the look..!

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాగార్జున హీరోయిన్..

అక్కినేని నాగార్జున(Nagarjuna) హీరోగా నటించిన సూపర్ సినిమా ద్వారా అనుష్క శెట్టి(Anushka Shetty) మాత్రమే కాదు ఈమె కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది . ఆమె ఎవరో కాదు ఆయేషా టాకియా.(Ayesha takia)ఈ సినిమాతో బీభత్సమైన ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ బ్యూటీ ముఖ కవళికలు, హావభావాలకు నాగార్జున అభిమానులు పరేషాన్ అయిపోయారు. ఆ తర్వాత హిందీ పరిశ్రమకే అంకితమైన ఈమె ఒకానొక సమయంలో అందాన్ని పెంచుకోవడానికి ముఖం, పెదవులకు శస్త్ర చికిత్సలు చేయించుకుంది. కానీ అవి వికటించి మొదటికే ముప్పు వచ్చిందనే వార్త వినిపిస్తోంది.

కొత్త వేషం చూసి ఫ్యాన్స్ నిరాశ…

పెదవులు వాచినట్టు కనిపించడంతో దానిని మీడియాలో పదేపదే హైలెట్ చేశారు. అయితే కొన్ని ఉదంతాల తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. మీడియా నుంచి తప్పుకుంది. అయితే ఇప్పుడు సడన్గా 13 సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్న ఈమె అందులో భాగంగానే సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అది కూడా కొత్త రూపంతో ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయి, అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. లేటెస్ట్ ఫోటో నెటిజన్లను షాక్ కి గురి చేసిందని చెప్పవచ్చు. ఇంతకుముందు చూసిన ఆయేషా నేనా అని అనుమానాలు వ్యక్తమవుతున్నారు. చాలామంది కొత్త వేషం చూసి నిరాశపడుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ , అందాల రాసి ఇలా మారిపోయింది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ట్రోల్స్ దెబ్బకు ఇన్స్టాఅకౌంట్ క్లోజ్..

ఇక ఈమె సినిమాల విషయానికొస్తే, వాంటెడ్, టార్జాన్ ది వండర్, సోచా నా థా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ, 2009లో ఫరహాన్ అజ్మీని వివాహం చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. అకస్మాత్తుగా ఇప్పుడు సెల్ఫీ తో నెట్ లో పెను సంచలనం సృష్టించింది ఈ ముద్దుగుమ్మ. నీలిరంగు చీర కట్టుకొని సెల్ఫీలో కనిపించింది. దీంతో అభిమానులు రకరకాల కామెంట్లు చేయడంతో తాజాగా ఇంస్టాగ్రామ్ ఖాతాని కూడా డిలీట్ చేసింది. ఏది ఏమైనా కామెంట్స్ భరించలేక ఇన్ స్టా అకౌంట్ ని డిలీట్ చేయడం ఆశ్చర్యకరమని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు