Saripodhaa Sanivaaram : నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో “సరిపోదా శనివారం” సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్, ట్రైలర్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక చిత్ర యూనిట్ కూడా గత కొన్ని వారాలుగా గ్యాప్ లేకుండా సినిమా కోసం వరుస ప్రమోషన్లు చేస్తుండగా, తాజాగా సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ లా అనిపించలేదు. ‘ఓజి’ (OG) ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్న మాదిరిగా ఈవెంట్ జరిగిందని అనిపిస్తుంది. ఇక్కడ జరిగిన తీరు అలాగే ఉంది మరి.
ఇక్కడ కూడా ఓజి గోల తప్పలేదు..
అయితే సరిపోదా శనివారం సినిమాకు డివివి దానయ్య నిర్మాత అని తెలిసిందే. ఓజి నిర్మిస్తున్న దానయ్యే ఈ సినిమాకు కూడా నిర్మాత కావడం వల్ల పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ఫ్యాన్స్ ఎక్కడపడితే అక్కడ దానయ్యని ఓజి గురించి రిక్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసారు. మొన్నామధ్య సరిపోదా శనివారం ట్రైలర్ లాంచ్ లో కూడా ‘ఓజి’ అప్డేట్ అడగగా, రీసెంట్ గా సరిపోదా శనివారం ప్రెస్ మీట్ లో ఏకంగా నానినే ఫ్యాన్స్ తరపున ఓజి అప్డేట్ అడిగాడు. ఇక ఇప్పుడు సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా పవన్ అభిమానుల సందడి ఎక్కువైంది. దానయ్య (Dvv Danayya) నుండి ఒక్క అప్డేట్ అయినా వస్తుందేమో అని ఆశతో వచ్చినట్టున్నారు. ఇక్కడితో ఆగకుండా చిత్ర యూనిట్ కూడా ఓజి గురించి ప్రస్తావించడం జరిగింది.
ఈవెంట్ లో యాంకర్ సుమ మొదలుకొని నిర్మాత దానయ్య, హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్, ఆఖరికి పవన్ కి దూరంగా ఉండే అలీ కూడా ఓజి ప్రస్తావన ఇండైరెక్ట్ గా తీసుకొచ్చాడు. కానీ ఫైనల్ గా దానయ్య మాత్రం ఓజి అప్డేట్ తొందర్లోనే వస్తుందని సైలెంట్ అయ్యాడు. ఇక టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న “ఓజి” సినిమా ఒకటి. ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నారు. మరి దానయ్య నుండి అప్డేట్ ఎప్పుడొస్తుందో చూడాలి. ఇక సరిపోదా శనివారం సినిమా ఆగష్టు 29న రిలీజ్ కి సిద్ధం అవుతుండగా, ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో విడుదల కానుంది.