Buddy OTT : టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ ఖాతాలో గత రెండు, మూడేళ్లుగా సినిమాలు లేవు.. ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తీసుకొని రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమాకు సైలెంట్ గా షూటింగ్ ను మొదలుపెట్టారు.. ఆ సినిమానే ‘బడ్డీ ‘.. ఈ సినిమా తమిళ హీరో ఆర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం టెడ్డీకి రీమేక్ గా వచ్చింది. శాన్ అంటోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరోసారి వార్తల్లో హైలెట్ గా నిలిచింది. ఈ సినిమా సైలెంట్ గా రిలీజ్ అయ్యి భారీ ప్రభంజనాన్ని సృష్టించింది. మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఓటీటి స్ట్రీమింగ్ డేట్ ను లాక్ చేసుకుంది.
ఇక తమిళ మూవీ టెడ్డీ రీమేక్గా బడ్డీ సినిమా తెరకెక్కింది. శాంట్ ఆంటోన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్ట్ 2న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో అల్లు శిరీష్కు జోడీగా గాయత్రి భరద్వాజ్, ప్రీషా రాజేష్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. ఈ ఫాంటసీ మూవీతోనే వీరిద్దరు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అజ్మల్ అమీర్ విలన్ పాత్రలో కనిపించాడు. తమిళ అగ్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఈ తెలుగు సినిమాను నిర్మించారు. యాక్షన్ కథతో హిట్టు కొట్టాలని అనుకున్న అల్లు శిరీష్ ప్రయత్నం అంతగా ఫలించలేదు. ఈ సినిమా టికెట్ ధరలను తగ్గించి మరి థియేటర్లలో రిలీజ్ చేశారు. కానీ ఆ సినిమా అనుకున్న హిట్ టాక్ ను అందుకోలేదు. ఇక తాజాగా ఓటీటిలోకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
థియేటర్లలోకి వచ్చిన బడ్డీ మూవీ థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. ఈ ఫాంటసీ యాక్షన్ మూవీ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతోంది.. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది.. అక్కడ ఓ మాదిరిగా ఆకట్టుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటిలో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..
ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఎయిర్ లైన్స్ లో పనిచేసే ఆదిత్య, పల్లవిలు ప్రేమలో పడతారు. అనుకోకుండా పల్లవి కారణంగా ఆదిత్య ఉద్యోగం పోతుంది. ఆదిత్యకు క్షమాపణ చెప్పడమే కాకుండా తన మనసులోని ప్రేమను అతడికి వ్యక్తం చేయాలని అనుకుంటున్న టైమ్లోనే పల్లవి మిస్సవుతుంది.పల్లవి ఏమైంది? పల్లవి మిస్సింగ్కు డాక్టర్ అర్జున్కుమార్కు ఏదైన సంబంధం ఉందా అనేది కథ…