Adi Purush: ఫిలిం ఇండస్ట్రీలో విషాదం. ఆదిపురుష్ నటి కన్నుమూత…

Adi Purush.. తాజాగా సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటీవలే వివిధ కారణాలవల్ల చాలామంది స్వర్గస్తులవుతున్నారు. అందులో కొంతమంది ఆత్మహత్య చేసుకుంటుంటే మరికొంతమంది అనారోగ్య కారణాల వల్ల తుది శ్వాస విడుస్తున్నారు. మరి కొంతమంది వృద్ధాప్య కారణంగా తుది శ్వాస విడుస్తున్నారు. అలా ఒక ఘటన మరువకముందే ఇంకొక విషాదం అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటి ఆశాశర్మ (Asha Sharma) ఆదివారం తుది శ్వాస విడిచారు.

Adi Purush: Tragedy in the Film Industry.  Aadi Purush actress passes away
Adi Purush: Tragedy in the Film Industry. Aadi Purush actress passes away

బాలీవుడ్ నటి ఆశాశర్మ తుది శ్వాస విడిచారు..

ప్రస్తుత ఆమె వయసు 88 సంవత్సరాలు బాలీవుడ్ నటి అయిన ఈమె వయసు మీద పడడంతో తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సినీ ,టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ఆమె మృతికి కారణాలు తెలియదు కానీ వయసు మీద పడడం వల్లే మరణించింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. టీవీ షోలు, సినిమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గర అయింది. ధర్మేంద్ర , హేమమాలిని నటించిన దో దిశాయీన్ అనే చిత్రం ద్వారా ఆశాశర్మ అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

4 దశాబ్దాల కెరియర్ లో దాదాపు 40 సినిమాలు..

తల్లి, అమ్మమ్మ పాత్రలతో అభిమానుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న ఈమె, బుల్లితెరపై ఎక్కువగా సీరియల్స్ లో కూడా నటించింది. ముఝేకుచ్, ప్యార్ తో హోనా హీ థా, హమ్ తుమ్హారే హై సనమ్ వంటి సీరియల్స్ లో నటించింది. అంతేకాదు కుంకుమ భాగ్య, మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ, ఏక్ ఔర్ మహాభారత్ తదితర సీరియల్స్ లో కూడా నటించి మెప్పించారు. దాదాపు చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈమె సినిమాలు, టీవీ షోలు చేస్తూ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఇక నాలుగు దశాబ్దాల కెరియర్ లో దాదాపు 40 సినిమాలు  చేసిన ఈమె అనేక టీవీ షోలు కూడా చేశారు. అంతేకాదు స్టార్ పరివార్ అవార్డ్స్ లో ఆశ ఫేవరెట్ వృద్ధుల అవార్డును కూడా గెలుచుకున్నారు.

- Advertisement -

ప్రభాస్ ఆది పురుష్ లో శబరి పాత్ర..

అంతేకాదు చాలా మంది స్టార్ హీరోలు సినిమాలలో కూడా నటించింది. ఇక చివరిగా ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ (Adi Purush)సినిమాలో ఆశాశర్మ నటించింది. ఇది రామాయణ ఇతిహాస గాధ ఆధారంగా తెరకెక్కిన ఆది పురుష్ సినిమాలో ప్రభాస్(Prabhas )రాముడిగా, కృతి సనన్(Kriti sanan)సీత గా నటించిన విషయం తెలిసిందే. ఇందులో శబరి క్యారెక్టర్ లో ఆశాశర్మ అద్భుతంగా నటించింది. ఇక ఈరోజు ఆమె వృద్ధాప్య లక్షణాల కారణంగా మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఆమె మరణం పై పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఆశ మరణం అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉండగా, ఆమెకు సినీ పరిశ్రమ అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు