Sai Durga Tej : మూవీ క్యాన్సల్ , దారుణంగా మారిన ప్రైమ్ షో పరిస్థితి

Sai Durga Tej : రీసెంట్ గా టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన సినిమా అంటే హనుమాన్ అని చెప్పాలి. సంక్రాంతి కానుక రిలీజ్ అయిన ఈ సినిమా మీద ముందు పెద్దగా అంచనాలు లేవు. అలానే ఈ సినిమాకు సరిపడా థియేటర్స్ కూడా దొరకలేదు. సంక్రాంతి సీజన్లో భారీ సినిమాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయి సత్తా చాటింది. కేవలం మౌత్ టాక్ తో ఈ సినిమా మంచి హిట్ అయింది. రోజురోజుకి సినిమాకి సంబంధించిన థియేటర్స్ కూడా పెరిగి దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాకి ప్రస్తుతం సీక్వెల్ రానుంది.ఈ సీక్వెల్ పై కూడా మంచి అంచనాలు మొదలయ్యాయి.

హనుమాన్ సినిమాని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది. ఈ సంస్థకి హనుమాన్ సినిమాతో మంచి లాభాలు వచ్చాయి. దీని తర్వాత ప్రైమ్ షో వాళ్లు డార్లింగ్ అనే సినిమా చేశారు. అలాగే డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాను భారీగా ఖర్చు చేసి మరీ నైజం ఏరియాలో రిలీజ్ చేశారు. కానీ, ఈ రెండు సినిమాల వల్ల ప్రైమ్ షో వాళ్లు దారుణంగా నష్ట పోయారు. ఒక డబులు ఇస్మార్ట్ వల్లే ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత నిరంజన్ రెడ్డికి 32 కోట్ల నష్టం వచ్చిందని సమాచారం.

రిస్క్‌లో సాయి ధరమ్ తేజ్ మూవీ…

వరుస నష్టాల తర్వాత నిరంజన్ రెడ్డి ఓ భారీ సినిమా చేస్తున్నాడు. అదే SDT18. సాయి ధరమ్ తేజ్ హీరోగా డెబ్యూ డైరెక్టర్ రోహిత్ కేపీ కాంబోలో ఈ మూవీ వస్తుంది. ఈ సినిమా దాదాపు 120 కోట్ల బడ్జెట్‌తో రాబోతుందని టాక్. అయితే ఈ సినిమా ఇప్పుడు రిస్క్ లో పడిందట. బడ్జెట్ భారమో, లేదా ఇంకా ఏదైనా కారణం ఉందా అనేది స్పష్టంగా తెలీదు. కానీ, ఈ సినిమా ఇప్పుడు దాదాపు క్యాన్సిల్ అయినట్టే అని Filmify కి సమాచారం అందింది. దీనిపై పూర్తి సమాచారం త్వరలోనే రానుంది.

- Advertisement -
Niranjan Reddy, Sai Dharam Tej SDT 18 Movie
Niranjan Reddy, Sai Dharam Tej SDT 18 Movie

ఫైనాన్షియర్ @ 20 కోట్లు..

ఈ SDT18 కోసం ఓ ఫైనాన్షియర్ దగ్గర నుంచి నిరంజన్ రెడ్డి 20 కోట్ల వరకు తీసుకొచ్చారట. ఈ డబ్బు మొత్తం కూడా డబుల్ ఇస్మార్ట్ కోసం ఉపయోగించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ మూవీ క్యాన్సిల్ అవుతుండటంతో ఫైనాన్షియర్‌తో నిరంజన్ రెడ్డి ఎలాంటి ఒప్పదం చేసుకున్నాడు అనే టాక్ కూడా వినిపిస్తుంది.

ఇంకా అమెరికాలోనే…

ఇటీవల నిరంజన్ రెడ్డి తన భార్యతో కలిసి అమెరికాకు వెళ్లారు. ఈ మధ్య కాలంలో ఈయన గురించి ఓ రూమర్ ఇండస్ట్రీలో తెగ వైరల్ అయింది. దీని గురించే అమెరికా వెళ్లారు అని కూడా టాక్ వచ్చింది. కానీ, నిజానికి నిరంజన్ రెడ్డి అమెరికా వెళ్లింది.. ఈ SDT18 కోసమే అని తెలుస్తుంది.

వేరే ప్రొడ్యూసర్ వేటలో SDT…

సాయి ధరమ్ తేజ్ కి ఈ SDT18 మూవీ స్టోరీ బాగా నచ్చిందట. దీంతో ఈ స్టోరీ వదులుకోవవడం ఇష్టం లేక మరో ప్రొడ్యూసర్ వేటలో పడ్డారట. 120 కోట్లు పెట్టే ప్రొడ్యూసర్ వచ్చిన వెంటనే మళ్లీ ఈ సినిమా స్టార్ట్ కావొచ్చు అని సమాచారం. కాగా, ఈ సినిమాకు “సంబరాల ఏటి గట్టు” అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు