Namita: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో జెమిని సినిమాతో తెలుగు ప్రేక్షకులను , తన అందచందాలతో ఆకట్టుకున్న నమిత(Namita )గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో, అందంతో, అందరినీ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ. అనతి కాలంలోనే ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత ఇండస్ట్రీకి రీ యంట్రీ ఇచ్చి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. పూర్తిగా బరువు పెరిగిపోయి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఈమె ఒక దేవాలయానికి వెళ్ళగా అక్కడ తనను అగౌరవపరిచారు అంటూ అసహనం వ్యక్తం చేసింది.
మధుర మీనాక్షి దేవాలయంలోకి రాకుండా అడ్డుకున్నారు..
అసలు విషయంలోకి వెళితే, మధుర మీనాక్షి దేవాలయ సిబ్బంది తనతో అగౌరవంగా మాట్లాడారు అంటూ ఆరోపించింది. తనని దేవాలయంలోకి వెళ్ళనివ్వలేదు అని ఆమె తెలిపింది. ఈ మేరకు ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది నమిత. కృష్ణాష్టమి వేడుకలలో భాగంగా కుటుంబంతో కలిసి మీనాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్ళాను. అయితే ఆలయంలోకి వెళ్లకుండా అక్కడ సిబ్బంది అడ్డుకున్నారు. నాకు సంబంధించిన సర్టిఫికెట్స్ చూపించమని తెలిపారు. ఈ వాక్యాలు నన్ను చాలా బాధ పెట్టాయి. తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రముఖ ఆలయాలను నేను సందర్శించాను. కానీ ఎవరు కూడా నాపై ఇలాంటి కామెంట్లు చేయలేదు. కానీ మొదటిసారి మధుర మీనాక్షి ఆలయ సిబ్బంది నాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దేవాలయంలోకి రాకుండా అడ్డుకట్ట వేశారు సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలి అంటూ కోరింది నమిత.
నమిత వ్యాఖ్యలపై ఆలయ సిబ్బంది స్పందన..
ప్రస్తుతం నమిత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. అయితే తాజాగా ఈ విషయంపై ఆలయ పరిపాలన సిబ్బంది స్పందించింది. నమితతో ఎవరు అమర్యాదకరంగా వ్యవహరించలేదు. ఆలయ నియమాల ప్రకారమే, ఆమెతో మాట్లాడాము.. పై అధికారులు చెప్పడంతో కొంత సమయం ఆగమని మేము ఆమెతో తెలిపాము. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. తర్వాత ఆమెను నేను ఆలయంలోకి అనుమతించాము అంటూ తెలిపారు. ఆలయంలో తనకు అవమానం జరిగిందని, తెలిపిన నమిత వెంటనే ఆలయ సిబ్బంది రియాక్ట్ అయ్యి ఆమెను ఇబ్బంది పరచలేదు అంటూ కామెంట్లు చేశారు.మొత్తానికి సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారుతున్నది.
నమిత కెరియర్..
నమిత కెరియర్.. తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయమైన ఈమె అసలు పేరు నమిత వాంక్వాలా. మే 10, 1980 గుజరాత్ లోని సూరత్ లో జన్మించింది. 1998లో మిస్ సూరత్ గా టైటిల్ గెలిచి, 2001లో మిస్ ఇండియా పోటీ 4వ స్థానం సంపాదించుకుంది. జెమినీ చిత్రం ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమైన ఈమె సొంతం సినిమాతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఒక రాజు ఒక రాణి , ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి చిత్రాలలో నటించి, ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈమె, ఆ తర్వాత తమిళ్, కన్నడ , హిందీ సినీ రంగంలోకి ప్రవేశించి ఆకట్టుకుంది. 2010లో వచ్చిన సింహ చిత్రంలో విశేషంగా అలరించింది. తర్వాత 2017 లో నటుడు వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకున్న ఈమె 2022 19న ఇద్దరు మగ శిశువులకు జన్మనిచ్చినట్లు ప్రకటించారు.
View this post on Instagram