Chiranjeevi – Keerthy Suresh.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని మహానటిగా చలామణి అవుతున్న కీర్తి సురేష్ (Keerthy Suresh) గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. నేను శైలజ (Nenu Sailaja) అనే సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన ఈమె ఆ తర్వాత నటించిన మహానటి (Mahanati )సినిమాతో ఏకంగా జాతీయస్థాయి అవార్డును దక్కించుకుంది. ఇకపోతే కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది అని అందరికీ తెలుసు. కానీ ఏ సినిమాలో నటించింది అనే విషయాలు మాత్రం దాదాపు చాలామందికి తెలియవనే చెప్పాలి.
చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం..
నిజానికి చైల్డ్ ఆర్టిస్ట్ లుగా ఇండస్ట్రీలోకి వచ్చిన చాలామంది నేడు స్టార్స్ గా , సూపర్ స్టార్స్ గా కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకు బాలకృష్ణ (Bala Krishna)ని మొదలుకొని మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ , రాశి , తరుణ్ ఇలా ఎంతోమంది ఈ లిస్టులోకి వస్తారు. అలా బాలనటిగా అడుగుపెట్టిన కీర్తి సురేష్ కూడా నేడు స్టార్ స్టేటస్ ను సంపాదించుకుంది. ఈమె తల్లి మేనక (Menaka) కూడా మలయాళంలో పెద్ద స్టార్ హీరోయిన్. తెలుగులో ఈమె మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన పున్నమినాగు చిత్రంలో నటించగా, తెలుగులో ఈమె చేసింది తక్కువ సినిమాలే అయినా మలయాళం లో మాత్రం ఒక స్టార్ హీరోయిన్గా చాలాకాలం కొనసాగింది.
డాడీ సినిమాలో అవకాశం అందుకున్న కీర్తి సురేష్..
ఇకపోతే కీర్తి సురేష్ కూడా తొలుత మలయాళం లోనే బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి , తెలుగులో కూడా నటించింది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)సినిమాలో నటించింది. అసలు విషయంలోకి వెళ్తే మాస్ ఇమేజ్ తో ఇండస్ట్రీలో చెలరేగుతున్న చిరంజీవి మొదటిసారి ఫ్యామిలీ డ్రామా డాడీ (Dady ) లాంటి సాఫ్ట్ చిత్రంతో 2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . ఈ సినిమా అప్పట్లో పాజిటివ్ రివ్యూస్ బాగానే దక్కించుకొని, ఇప్పటికీ కూడా ప్రేక్షకులను అలరిస్తోంది.కానీ మాస్ ఆడియన్స్ కి మాత్రం ఈ చిత్రం పెద్దగా నచ్చలేదు. దాంతో యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమాలో కూతురు పాత్ర కోసం అప్పట్లో ఎంతో మందిని ఆడిషన్స్ చేశారట చిరంజీవి.
చిరు కూతురుగా కీర్తి సురేష్..
అలా అనుకోకుండా చిరు దృష్టిలోకి కీర్తి సురేష్ వచ్చింది. 2000 వ సంవత్సరంలో మలయాళంలో పైలట్ అనే చిత్రంలో కీర్తి సురేష్ చేసింది. ఇందులో ఈమె నటన చూసి ముగ్ధుడైన చిరంజీవి డాడీ సినిమాలో నటింప చేస్తే బాగుంటుంది అనుకున్నారట. కీర్తి సురేష్ తల్లి కూడా ఒప్పుకుంది. రెండు కీలకమైన సన్నివేశాలను కూడా డైరెక్టర్ సురేష్ కృష్ణ తీశారు. అలా ఆ రెండు సన్నివేశాలలో కీర్తి సురేష్ చిరంజీవికి కూతురిగా నటించింది.
కూతురిగా ఛాన్స్ మిస్సయినా .. చెల్లిగా అవకాశం..
ఆ తర్వాత అవుట్ పుట్ చూసిన సురేష్ కృష్ణ సంతృప్తి చెందక, తాను అనుకున్నట్టుగా పాప క్యారెక్టర్ రావడం లేదని చిరంజీవికి చెబితే , ఆయన వేరే అమ్మాయిని చూద్దామని చెప్పి, కీర్తి సురేష్ ని తప్పించి అనుష్క మల్హోత్రా (Anushka Malhotra)అనే అమ్మాయిని తీసుకున్నారు. ఈ అమ్మాయి ఈ సినిమా తర్వాత మరే సినిమాలో కూడా కనిపించలేదు. అలా కీర్తి సురేష్ బాలనటిగా చిరంజీవి సినిమాలో నటించినా కూడా వెండితెర మీద ఆయనతో కలిసి కనిపించే అదృష్టం తగ్గలేదు. అయితే ఈమె హీరోయిన్ అయిన తర్వాత భోళాశంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లిగా నటించింది కీర్తి సురేష్.