Radika Sharath Kumar.. మలయాళ సినీ ఇండస్ట్రీలో గత వారం రోజులుగా జస్టిస్ హేమా కమిటీ హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా చిత్రసీమలో మహిళల పైన వేధింపుల గురించి ఈ కమిటీ ఇచ్చిన నివేదిక తీవ్ర చర్చనీయాంశంగా అన్ని ఇండస్ట్రీలలో మారుతోంది. ఇప్పటికే ఈ విషయం పైన చాలామంది నటీనటులు తమ అభిప్రాయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఇలాంటి క్రమంలోనే తాజాగా గతంలో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన రాధిక శరత్ కుమార్ (Radhika Sarath Kumar) పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎక్కువే..
రాధిక శరత్ కుమార్ మాట్లాడుతూ.. కేవలం మలయాళ సినీ పరిశ్రమలోనే కాదు మహిళల వేధింపులు అన్ని ఇండస్ట్రీలో ఉన్నాయని ఇలాంటి ఇబ్బందులు చాలామంది మహిళలు ఎదుర్కొన్నారని కూడా తెలియజేసింది. ముఖ్యంగా నటీమణులకు కేటాయించినటువంటి క్యారవాన్లలో కొంతమంది ఏకంగా సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలను చిత్రీకరించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయంటూ ఆరోపించింది రాధికా శరత్ కుమార్. ఈ విషయం విన్న అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి సంఘటన తనకు కేరళకు వెళ్ళినప్పుడు అక్కడ గమనించానంటూ తెలియజేసింది రాధిక.. సినిమా షూటింగ్ సెట్ లో జరిగిన ఒక సంఘటన తాను ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నానంటూ తెలియజేసింది.
క్యారవాన్ లో ఘోరాలు..
రాధిక సినిమా షూటింగ్ ముగించుకొని వెళుతున్న సమయంలో కొంతమంది పురుషులందరూ కూడా ఒకచోట చేరి మొబైల్లో ఏదో చూసుకుంటూ నవ్వుకుంటున్నారని , కానీ వారందరూ కలిసి ఏదో ఒక వీడియో చూస్తున్నారనే విషయాన్ని తనకు అర్థం అయిందని.. అయితే చిత్ర యూనిట్ లో కొంతమంది సిబ్బందిని పిలిచి వారు ఏం వీడియో చూస్తున్నారో అని కనుక్కోమని పంపించాను. అప్పుడే తనకు ఇలాంటి షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చిందని తెలిపింది రాధికా శరత్ కుమార్. అప్పుడే క్యారవాన్లలో కూడా సీక్రెట్ కెమెరాలు ఉంటాయని విషయం బయటపడిందని తెలిపింది. రాధిక శరత్ కుమార్.
ఆరోజే అలాంటి నిర్ణయం తీసుకున్నా..
ముఖ్యంగా మహిళలకు సంబంధించి వ్యక్తిగత వీడియోలను చిత్రీకరించి మరీ మొబైల్ లోనే చూస్తూ ఉన్నారని ఆరోపించింది. ఈ విషయం వెంటనే తమ చిత్ర యూనిట్ కి కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని, ఆ సంఘటన జరిగి ఇప్పటికీ కొన్ని సంవత్సరాలు అయినా కూడా ఈ సంఘటనని మాత్రం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నానని అందుకే తాను తన జీవితంలో క్యారవ్యాన్ లు అనేటివి ఉపయోగించకూడదని ఆరోజు నిర్ణయించుకున్నారని తెలియజేసింది రాధిక శరత్ కుమార్. అప్పట్లో హోటల్ రూమ్ కి వెళ్లి మరీ తాను దుస్తులను మార్చుకునే దానినే అంటూ తెలియజేసింది వరలక్ష్మి శరత్ కుమార్. ఇలాంటి సంఘటనలే కాకుండా చాలా సంఘటనలు కూడా అన్ని ఇండస్ట్రీలో ఉండనే ఉన్నాయి . కానీ చాలామంది చెప్పడానికి మొహమాటపడుతూ ఉంటారని తెలిపింది.