DVV Danayya : రంగస్థలం షూటింగ్ చూస్తుంటే కళ్ళలో నీళ్లు వచ్చాయి

DVV Danayya : ప్రతి నటుడు కెరియర్లో చిరస్థాయిగా మిగిలిపోయే సినిమా ఒకటి ఉంటుంది. రామ్ చరణ్ తేజ్(Ram Charan Tej) విషయానికి వస్తే రంగస్థలం(Rangasthalam) సినిమాకి ముందు రంగస్థలం సినిమా తర్వాత అని చెప్పారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. రామ్ చరణ్ తేజ్ లోని ఒక పరిపూర్ణమైన నటుడును బయటికి తీసింది రంగస్థలం సినిమా. కేవలం రామ్ చరణ్ కి మాత్రమే కాకుండా సుకుమార్లో ఒక కొత్త తరహా దర్శకుడు ఉన్నాడు అని ప్రూవ్ చేసిన సినిమా రంగస్థలం.

ఈ సినిమాని సుకుమార్(Sukumar) డీల్ చేసిన విధానం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. సుకుమార్ ఈ కైండ్ ఆఫ్ సినిమాలు కూడా తీయగలరా అనేలా ఎక్స్పీరియన్స్ ఇచ్చింది రంగస్థలం. అయితే ఈ సినిమాకి సంబంధించి అన్ని అంశాలు కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. యాక్షన్ సీక్వెన్సెస్, సుకుమార్ ఈ కథను డీల్ చేసిన విధానం, రామ్ చరణ్ తేజ్ నటించిన విధానం, ఈ సినిమాలోని ఎమోషనల్ సీన్స్ అన్నీ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఒక సినిమా సక్సెస్ అయిన తర్వాత చాలామంది మాట్లాడుతారు కానీ ఆ సినిమా సక్సెస్ కంటే ముందు అది సక్సెస్ అవుతుంది అని గ్రహించటం వేరు.

రంగస్థలం సినిమా షూటింగ్ జరుగుతున్న తరుణంలో నిర్మాత డివివి దానయ్య రామ్ చరణ్ తేజ్ కలవడానికి సెట్స్ కు వెళ్లారట. అయితే అక్కడ షూటింగ్ చూసి దానయ్యకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయని చెప్పుకొచ్చారు. రంగస్థలం సినిమాలో చిట్టిబాబు బ్రదర్ చనిపోయిన సీన్, అతనిని మోసుకెళ్ళడం ఇవన్నీ చూసి ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుద్ది అని రామ్ చరణ్ తో చెప్పారట దానయ్య. ఈ సినిమా తర్వాత డివివి బ్యానర్ లో వినయ విధేయ రామ(Vinaya Vidheya Rama) అనే సినిమాను చేశాడు రామ్ చరణ్. ఈ సినిమా ఊహించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.

- Advertisement -

Rangasthalam

ప్రస్తుతం డివివి ఎంటర్టైన్మెంట్స్ లో వస్తున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం ఓజి. ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా ఈ బ్యానర్ నుంచి సరిపోదా శనివారం అనే చిత్రం రిలీజ్ అయింది. వివేకాత్రేయ దర్శకత్వంలో నాని నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతానికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ తో ఈ సినిమా కొనసాగుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు