Jyoti poorvaj..సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్స్ కి లైఫ్ టైం చాలా తక్కువ. కొంతమంది వయసుతో తేడా లేకుండా అవకాశం వస్తే మాత్రం ఏ వయసులో అయినా సరే నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉంటారు. అలాంటి వారిలో ప్రముఖ సీరియల్ నటి జ్యోతి పూర్వాజ్ (Jyoti poorvaj)కూడా ఒకరు. గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి పాత్రలో నటించి మెప్పించిన ఈమె కన్నడ ఇండస్ట్రీకి చెందింది . పలు టీవీ సీరియల్స్ , వెబ్ సిరీస్ లతో మంచి పేరు తెచ్చుకున్న ఈమె, ఇప్పుడు ఇప్పుడే సినిమాలలో ఫుల్ బిజీ అవుతోంది. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె సినిమా ఇండస్ట్రీలో జరిగే సంచలన విషయాలను బయటపెట్టింది.
మోడల్ గా ప్రయాణం మొదలు..
జ్యోతి బెంగళూరు కి చెందిన అమ్మాయి. మోడల్గా ప్రయాణాన్ని మొదలుపెట్టి.. తన అంద చందాలతో మెప్పించింది. ఈ క్రమంలోనే బందే బరాటవ కాలా అనే సీరియల్ ద్వారా నటి గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత అదే భాషలో పలు సీరియల్స్ లో నటించింది. అక్కడ గుర్తింపు రావడంతో తమిళం, తుళు భాషల్లో కూడా సీరియల్స్ చేసిన జ్యోతి, చాలా కాలం క్రితమే కన్యాదానం అనే సీరియల్ తో తెలుగులోకి అడుగు పెట్టింది .ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి క్యారెక్టర్ లో కనిపించి క్రేజ్ పెంచేసుకుంది.
జ్యోతి నటించిన చిత్రాలు..
ఇకపోతే సీతారామ కళ్యాణ, స్టేషన్ 3, దియా వర్ణపాఠల వంటి చిత్రాలలో కూడా నటించిన ఈమె దియా, గంధాడ్ గుడి, 99, మడిపు వంటి వెబ్ సిరీస్ లలో కూడా నటించింది ఇకపోతే డైరెక్టర్ సుకు పూర్వాజ్ తో లవ్ ట్రాక్ నడిపిన ఈమె, ఇటీవలే పెళ్లి చేసుకుని కొత్త బంధంలోకి అడుగు పెట్టింది.
అమ్మాయిలకు అమ్మాయిలే శత్రువులు..
ఇకపోతే ఇండస్ట్రీలో జరుగుతున్న అంశాలు, సోషల్ మీడియా విషయాలపై ఫోకస్ పెట్టిన ఈమె ఈ విషయాలపై స్పందిస్తూ అమ్మాయిలకు అమ్మాయిలే శత్రువులు. మొన్న రేపు జరిగింది కదా.. ఆ న్యూస్ కి సంబంధించిన కామెంట్స్ చూస్తే అమ్మాయిలే నెగిటివ్గా కామెంట్లు చేస్తూ ఆశ్చర్యపరిచారు. అలా ఇంకొకరి గురించి మీరు ఎలా మాట్లాడుతారు ..?ఎక్కడో గాలిలో ఒక న్యూస్ వస్తే అది ఎలా మీరు ఫార్వర్డ్ చేస్తారు అంటూ మెసేజ్లు మీకు చూపిస్తాను అంటూ.. వాటిని చూపిస్తూ.చూసేకి శ్రీరాముల్లాగా చాలా చక్కగా మాట్లాడుతారు. మళ్ళీ చెత్త మెసేజ్లు పంపిస్తారు. ఇప్పుడు మీ అక్క, చెల్లి , అమ్మ ఒకవేళ బట్టలు లేకుండా ఉంటే వాళ్ళని మీరు రేప్ చేస్తారా..? మీ కూతురుతో కూడా ఇలాగే ప్రవర్తిస్తారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
డబ్బు కోసమే ఇదంతా..
ఇకపోతే సోషల్ మీడియాలో కొంతమంది డబ్బు కోసమే పోస్టులు, వీడియోలు పెడుతున్నారని, కానీ రేపు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా అలా అయితే అప్పుడు ఎలా మాట్లాడుతారు ..ఎలా జడ్జ్ చేస్తారు.. అంటూ కూడా ప్రశ్నించింది. మొత్తానికి అయితే సోషల్ మీడియాలో నెటిజెన్లు పెట్టే కామెంట్స్ లపై కూడా స్పందించి ఆశ్చర్యపరిచింది జ్యోతి.