Bigg Boss 8: తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నా బిగ్ బాస్ సీజన్ 8 ఎట్టకేలకు ప్రారంభమైంది. ఇక నిన్న సాయంత్రం షో ప్రారంభమవగా.. అప్పుడే హౌస్ లో హౌస్ కి చీఫ్ ఎవరు అనే విషయంపై గొడవలు మొదలయ్యాయి. ఇక థర్డ్ చీఫ్ ఎవరు అంటూ ఒక ప్రోమో ని విడుదల చేశారు. ఈ ప్రోమోలో సోనియా – యష్మి మధ్య గొడవ తారా స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హౌస్ లో థర్డ్ చీఫ్ ఎవరు అంటూ విడుదల చేసిన ప్రోమో ఆధ్యంతం ఆకట్టుకోవడమే కాదు ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది అని చెప్పవచ్చు..
థర్డ్ చీఫ్ ఎవరు..
ప్రోమో విషయానికి వస్తే.. రెండవ ఎపిసోడ్ కి సంబంధించి.. బేబక్క , ఆర్. జె. శేఖర్, యష్మీ, నబీల్ ఆఫ్రిది పేర్లు చెబుతూ వీరికి కూడా మిగిలిన చీఫ్ స్థానాలను భర్తీ చేయాలని ఉంది అంటూ బిగ్ బాస్ చెబుతారు. మరి వీరి నలుగురిలో ఎవరిని మూడవ చీఫ్ గా ఎంచుకుంటారు అంటూ మిగిలిన ఇంటి సభ్యులను కోరారు బిగ్ బాస్. ఇక టాస్క్ నిర్వహించగా అందులో బేబక్క మాట్లాడుతూ.. మీరు ఒకటి అనుకున్నారు కదా అందులోనే మీరు వెళ్ళండి అంటూ ఇంటి సభ్యులతో చెబుతుంది. దీంతో వెంటనే రియాక్ట్ అయిన కిరాక్ సీత మీరు ఇల్లు చూసుకోలేరా అంటూ ప్రశ్నిస్తుంది. వెంటనే నైనిక రియాక్ట్ అవుతూ బేబక్కపై కామెంట్ చేస్తుంది. ఒక ఒపీనియన్ పై ఉన్నప్పుడు దాని పైన వెళ్లాలి అంటూ కామెంట్ చేస్తుంది.
చీఫ్ కోసం సోనియా – యష్మి మధ్య గొడవ..
ఆ తర్వాత నిఖిల్, నబీల్ ను ఉద్దేశించి ఈ రెండు రోజుల్లో ఎక్కడ నీకు ఆ క్యాపబుల్ ఉన్నట్టు నేను గుర్తించలేదు. అంటూ కామెంట్ చేస్తాడు. ఇక వెంటనే సోనియా ఇంట్రాక్ట్ అవుతూ.. రెండు రోజుల్లో గమనించినట్లయితే కొన్నిచోట్ల యష్మి ఎక్కువగా తన గొంతు వినిపించింది. యష్మీ ని రూల్ అవుట్ చేయడానికి పాయింట్ ఏంటంటే, ఆమె బాధ్యత లేనట్టు గా ఉంటుంది అంటూ కామెంట్ చేయడంతో.. వెంటనే సీరియస్ అయిన యష్మి ఎందుకు ప్రతిసారి మీరు నా పేరు లాగుతున్నారు.. దయచేసి మీ పదాలను నోరు జారకండి అంటూ ఆమెపై రియాక్ట్ అయ్యింది. అలా ఇద్దరి మధ్య గొడవ తారా స్థాయికి చేరడంతో వెంటనే రియాక్ట్ అయిన నిఖిల్, నేను ఆన్సర్ చేస్తాను అంటూ తన వాయిస్ రైజ్ చేస్తాడు. ఇంతటితో ప్రోమో అయిపోతుంది. ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. మరి హౌస్ కి థర్డ్ చీఫ్ గా ఎవరు నిలవబోతున్నారో తెలియాలంటే ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే.