Nagarjuna vs Balayya : ఈవెంట్ కు నాగ్ డుమ్మా… బాలయ్య రాజేసిన చిచ్చే కారణమా?

Nagarjuna vs Balayya : నందమూరి బాలకృష్ణ సినీ పరిశ్రమలో ప్రయాణం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు, హీరోలు, చాలా మంది దర్శకులు హాజరయ్యారు. అయితే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న దిగ్గజ సీనియర్ స్టార్స్ లో ఒకరైన అక్కినేని నాగార్జున బాలయ్య వేడుకను స్కిప్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం బాలయ్య రాజేసిన ఆ చిచ్చే అనే గుసగుసలు విన్పిస్తున్నాయి.

నాగ్ డుమ్మా

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లు 90లలో పోటాపోటీగా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. 2000లలో టాలీవుడ్‌కు ఈ నాలుగు స్టార్ హీరోలు నాలుగు స్తంభాలుగా ఉండేవారు. అయితే సినిమాల సంగతి ఎలా ఉన్నా పర్సనల్ గా మాత్రం ఈ హీరోలంతా బాగానే ఉండేవారు. అప్పట్లో కొన్ని ఈవెంట్లలో ఈ నలుగురు స్టార్ హీరోలు ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి అభిమానులకు మరచిపోలేని మెమొరీస్ ఇచ్చారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అందరు హీరోల మధ్య గ్యాప్ పెరిగిపోయింది. సినిమాలతో బిజీ బిజీగా ఉండడం వల్లనో అందరినీ ఒకే వేదికపై చూడడం అభిమానులకు సాధ్యం కాలేదు. అయితే ఇన్నేళ్లకు మరోసారి చిరు, బాలయ్య, నాగ్, వెంకటేష్ లను ఒకే వేదికపై, ఒకే ఫ్రేమ్ లో చూసే అరుదైన అవకాశం దక్కుతుందని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేశారు. కానీ బాలయ్య 50 ఏళ్ల సినీ వేడుకలో ఆ అరుదైన దృశ్యం జరగలేదు. దానికి కారణం నాగ్. నాగార్జున ఈ వేడుకకు డుమ్మా కొట్టి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే దీనంతటికీ కారణం బాలయ్యే అంటున్నారు.

బాలకృష్ణ - నాగార్జున కాంబినేషన్ లో మిస్సైన మల్టీస్టారర్ సినిమాలు |  nandamuri balakrishna and akkineni nagarjuna combination missed movies -  Telugu Oneindia

- Advertisement -

బాలయ్యే కారణమా ?

నిజానికి అక్కినేని, నందమూరి ఫ్యామిలీల మధ్య మంచి బాండింగ్ ఉంది. అయితే కొంతకాలం క్రితం బాలకృష్ణ ఓ వేడుకలో తెలుగు చిత్ర పరిశ్రమలోనే దిగ్గజ నటుడైన అక్కినేని నాగార్జునను అవమానించే విధంగా మాట్లాడిన విషయం గుర్తుండే ఉంటుంది. అక్కినేని గిక్కినేని అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యాన్స్ అప్పట్లో ఫైర్ అవ్వడంతో , తరువాత బాలయ్య వివరణ ఇచ్చుకున్నారు. కానీ ఇప్పటిదాకా ఈ విషయంపై నాగ్ ఎక్కడా స్పందించలేదు. అయితే అందరిలాగే బాలయ్య 50 ఏళ్ల సినీ వేడుకకు నాగ్ కు కూడా ఆహ్వానం అందిందని టాక్ నడిచింది. చాలామంది సినీ పెద్దలు పనులన్నీ వదులుకుని ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. కానీ నాగ్ గానీ, అక్కినేని హీరోలు గానీ ఈ వేడుకలో పాలు పంచుకోకపోవడానికి కారణం అప్పట్లో బాలయ్య చేసిన కామెంట్స్ అని అంటున్నారు. బాలయ్య నోరు జారీ రాజేసిన ఆ చిచ్చు ఇంకా మండుతోందని, నాగ్ ఇంకా ఆ విషయాన్ని మర్చిపోలేదని, అందుకే ఒక్క అక్కినేని హీరో కూడా ఈ ఈవెంట్ లో కన్పించలేదని అంటున్నారు. మరి టాలీవుడ్ కు నాలుగు స్తంభాలుగా ఉన్న నాగ్, వెంకీ, చిరు, బాలయ్య ఒకే ఫ్రేమ్ లో కన్పించే అరుదైన అవకాశం మళ్లీ ఎప్పుడొస్తుందో మరి !?

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు