Game Changer.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రామ్ చరణ్ (Ram Charan), రాజమౌళి (Rajamouli ) దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ఆయనకు గ్లోబల్ స్థాయి ఇమేజ్ ను అందించింది. అంతేకాదు ఇటీవల డాక్టరేట్ ను కూడా అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తీసుకొచ్చిన గుర్తింపు ఆయనను ఎక్కడికో తీసుకెళ్ళింది అని చెప్పడంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈయన ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అంటూ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ ఎప్పటికప్పుడు షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల వాయిదా పడుతూ వస్తోంది . ఇకపోతే ఏడాది డిసెంబర్ 20న చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది.
గేమ్ ఛేంజర్ ఇంకా 20 రోజులు షూటింగ్ మిగులు..
మరోవైపు ఇంకా 20 రోజుల షూటింగ్ మిగిలి ఉందని , దీని ఎఫెక్ట్ నిర్మాత పై పడబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. గత మూడు సంవత్సరాలుగా గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ సాగుతూనే ఉంది. దీనికి కారణం డైరెక్టర్ శంకర్ అని చెప్పవచ్చు. ఒకవైపు కోలీవుడ్ లో ప్రముఖ స్టార్ హీరో కమలహాసన్ (Kamal Hassan) తో భారతీయుడు 2 సినిమా షూటింగ్ చేస్తూ, మరొకవైపు రాంచరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ చేశారు . ఇలా రెండు పడవల మీద ప్రయాణం ఆయనను మరింత ఇబ్బందిగా మార్చేసింది.
సినిమా నుంచి తప్పకుండా శంకర్..
దాంతో రాంచరణ్ సినిమాను పక్కన పెట్టేసి భారతీయుడు 2 సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి విడుదల కూడా చేశారు. కానీ ఈ సినిమా విడుదలై డిజాస్టర్ ను మూటగట్టుకుంది. పైగా భారతీయుడు 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నప్పుడు గేమ్ ఛేంజర్ సినిమా సన్నివేశాలను అసిస్టెంట్ డైరెక్టర్లతో పూర్తి చేయించాడు
కొన్ని సీన్స్ కి హిట్ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలను కూడా దర్శకత్వం వహించారు. ఇక భారతీయుడు 2 రిలీజ్ అయింది కదా ఇప్పుడైనా ఈ సినిమాపై ఫోకస్ చేస్తారని అందరూ అనుకున్నారు కానీ శంకర్ అనూహ్యంగా భారతీయుడు 3 పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో శంకర్ బిజీగా ఉన్నారట. అందుకే ప్రస్తుతం కొనసాగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ పార్టీకి ఎస్ జె సూర్య (SJ Surya) దర్శకత్వం చేస్తున్నట్లు సమాచారం.
రంగంలోకి ఎస్ జె సూర్య..
ఇకపోతే సూర్య ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో నటుడిగా బిజీగా ఉన్నారు. తెలుగులో నాని నటించిన సరిపోదా శనివారం సినిమాలో నటించారు. ఇకపోతే తెలుగులో దర్శకుడిగా నాని , ఖుషి , పులి వంటి సినిమాలు చేసిన ఎస్ జె సూర్య మరొకవైపు శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు 2 సినిమాల్లో కూడా విలన్ గా నటించారు. ఇక ఇప్పుడు ఇంకా 20 రోజుల సినిమా షూటింగ్ మిగిలి ఉందని, ఆ భాగాన్ని ఎస్ జె సూర్య ఫినిష్ చేసే బాధ్యతలు తీసుకున్నారట. ఒక సినిమాకి ఇంతమంది డైరెక్టర్లు అంటే ఔట్పుట్ పై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
నిర్మాతకు నష్టం తప్పదా..
దీనికి తోడు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ఆలస్యం అవడం ఎప్పటికప్పుడు నిర్మాతపై భారం పడతోందని చెప్పవచ్చు. మరి అనుకున్న సమయానికల్లా సినిమా విడుదల చేస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై చిత్ర బృందం ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి.