BiggBoss8 : అదే సెంటిమెంట్ డైలాగ్ చెప్తూ దిగజారిపోతున్న నాగమణి కంఠ

Bigg Boss 8 : బుల్లితెర ప్రియులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో నాగార్జున (Nagarjuna) హోస్ట్ గా సీజన్ 8 సెప్టెంబర్ 1 నుండి ప్రారంభమైందని తెలిసిందే. ఇక మొదటి ఎపిసోడ్ లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా, ఇందులో పలు టీవీ సీరియల్స్ నటులు, సినిమా నటులతో పాటు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే ఈసారి బుల్లితెర నటులు ఎక్కువగా ఉండడంతో టెలివిజన్ ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇదిలా ఉండగా షో మొదలై మూడు రోజులు కూడా కాలేదు. అప్పుడే నామినేషన్ల ప్రక్రియ మొదలైంది.

ఈ ముగ్గురూ నామినేషన్ నుండి సేఫ్…

ఇక హౌస్ లో ముందుగా హౌస్ చీఫ్ గురించి టాస్క్ లు జరగగా అందులో ముగ్గురు గెలిచినా విషయం తెలిసిందే. యష్మి గౌడ , నిఖిల్ , నైనిక హౌస్ చీఫ్ లు గా గెలవడం జరిగింది. ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఇక యష్మి గౌడ, నిఖిల్, నైనికా చీఫ్ లు కావడంతో ఈ వారం వీరు నామినేషన్స్ నుండి సేఫ్ అవుతారని, వీరిని నామినేట్ చేయడం కుదరదని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. అయితే మిగతా వారి మధ్య పోటీ జరగగా, నామినేషన్స్ లో ఎక్కువగా నాగమణికంఠ, బేబక్క, నబీల్, సోనియా, సీత మధ్య ఎక్కువగా జరిగింది. ఇక మొదటివారమే అయినా ఒకరితో ఒకరికి పడనట్లు చిన్న చిన్న కారణాలకు నామినేట్ చేసుకున్నారు వీళ్ళందరూ.

సెంటిమెంట్ డైలాగ్స్ తో దిగజారిపోయిన నాగమణికంఠ

ఇక ఈ నామినేషన్స్ లో ఎక్కువగా నాగమణికంఠను (Nagamanikantha) హౌస్ మేట్స్ నామినేట్ చేసారు. దానికి అతని వ్యక్తిగత ప్రవర్తన కారణం అని అప్పుడే తెలిసిపోతుంది. హౌస్ లోకి రావడం మొదలు… అనిల్ రావిపూడి అతనితో చేసిన ప్రాంక్ సమయంలోనే నాగ మణికంఠ తన పర్సనల్ కష్టాలు చెప్పుకోవడం స్టార్ట్ చేసాడు. అది ప్రాంక్ అని తెలిసాక చల్లబడ్డా, మిగతా సమయాల్లో హౌస్ మేట్స్ తో అదే విషయాన్నీ చర్చిస్తూ, ఆఖరికి హౌస్ మేట్స్ నామినేట్ చేస్తుంటే కూడా తన పాప కోసం వచ్చానని, ఏవేవో సెంటిమెంట్ డైలాగులు చెప్పడం మొదలెట్టాడు. అయితే అతను నిజంగా ఎన్నో కష్టాలు పడ్డా, అవి హౌస్ లో తన బలంగా మార్చుకోవాలి తప్ప, బలహీనతలు కావొద్దని నెటిజన్లు అంటున్నారు. ఇక హౌస్ మేట్స్ కూడా ఎక్కువగా నాగమణికంఠనే నామినేట్ చేసారు. మరి ఈ వారం తొలి నామినేషన్స్ లో ఎవరి ఎలిమినేషన్ ఉంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు