Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు చేతిలో దాదాపు అరడజనుకు పైగా సినిమాలతో బిజీగా ఉంది. కానీ మళ్లీ అవకాశాల కోసం అనే బాలీవుడ్ నిర్మాతల ఇంటి చుట్టూ తిరుగుతుండడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ బ్యూటీ ఓ బాలీవుడ్ నిర్మాత ఇంటి దగ్గర కన్పించిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అవకాశాల కోసమేనా?
రష్మిక మందన్న ఇటీవలే ముంబైలో క్యాజువల్ లుక్లో కనిపించింది. ఈ బ్యూటీ హై-వెయిస్ట్ జీన్స్తో పాటు వైట్ పొడవాటి చేతుల టాప్ వేసుకుని అట్రాక్టివ్ గా కన్పించింది. వాటికి జతగా తెల్లటి స్నీకర్స్, మ్యాచింగ్ హ్యాండ్బ్యాగ్, బ్లాక్ సన్ గ్లాసెస్తో తన లుక్ ను పూర్తి చేసింది. ఇంత మినిమల్ గా రెడీ అయినప్పటికీ క్యూట్ గా కన్పించింది. అయితే అసలు విషయం ఏమిటంటే ఇలా రెడీ అయ్యి రష్మిక ఎక్కడికి వెళ్ళింది? దీనికి సమాధానం ఏమిటంటే ఆమె ముంబైలోని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాడ్వాలా ఆఫీసు బయట కన్పించింది. పైగా అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్లకు ఫోజులు కూడా ఇచ్చింది. దీంతో రష్మిక మరో కొత్త చిత్రానికి సిద్ధమవుతుందా ? అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే రష్మిక ఫోటోలకు అయితే ఫోజులు ఇచ్చింది. కానీ సాజిద్ నదియాడ్వాలాతో సినిమా చేయబోతున్నారా? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వలేదు. కానీ చేతిలో చాలా సినిమాలు ఉన్నప్పటికీ రష్మిక మరో కొత్త సినిమాకు రెడీ అవుతుందా? అనేది విచిత్రంగా మారింది.
రష్మిక కిట్టిలో ఉన్న సినిమాలు
రష్మిక మందన్న పైప్లైన్లో ఇప్పటికే అనేక బిగ్ సినిమాలు ఉన్నాయి. ఈ బ్యూటీ సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2: ది రైజ్ చేస్తోంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన సీక్వెల్ లో ఆమె శ్రీవల్లిగా తన పాత్రలో మళ్లీ నటిస్తుంది. ఫహద్ ఫాసిల్ ఇందులో కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. పుష్ప 2తో పాటు రష్మిక కుబేరలో ధనుష్, అక్కినేని నాగార్జునతో కలిసి నటించనుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ముంబైలోని ధారవిలో ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకుంటోంది. మాఫియా లార్డ్గా మారే ఇల్లు లేని వ్యక్తి కథ ఇది. వీటితో పాటు రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్ వంటి సౌత్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.
ఇక బాలీవుడ్ విషయానికొస్తే ఛావా సినిమాలో విక్కీ కౌశల్తో కలిసి రష్మిక స్క్రీన్ షేర్ చేసుకోనుంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చారిత్రక డ్రామాలో ఆమె యేసుబాయి భోంసాలే పాత్రను పోషించనుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రష్మిక మందన్న మెయిన్ లీడ్గా నటించిన ఛావా, పుష్ప 2 ఈ ఏడాది డిసెంబర్ 6న బాక్సాఫీస్ వద్ద క్లాష్ అవుతాయి. మరోవైపు సల్మాన్ ఖాన్తో తన కొత్త ప్రాజెక్ట్ కోసం కూడా సిద్ధమవుతోంది. ఏఆర్ మురుగదాస్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి సంబంధించి అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే.