Nithiin : పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన నితిన్ భార్య

Nithiin : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తండ్రయ్యాడు. తాజాగా ఆయన భార్య శాలిని పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్టుగా సమాచారం. మరి నితిన్ ఇంట్లోకి అడుగు పెట్టింది మహాలక్ష్మి లాంటి అమ్మాయా? లేక అబ్బాయా? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.

తండ్రి అయిన నితిన్

యంగ్ హీరో నితిన్ 2020లో శాలిని కందుకూరి అనే అమ్మాయిని పెళ్లాడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ దంపతులకు పండంటి మగ బిడ్డ జన్మించాడు. దీంతో ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నితిన్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా నితిన్ తన స్నేహితురాలైన శాలిని కందుకూరిని హైదరాబాద్లో ఉన్న ఫలక్నుమా ప్యాలెస్ లో 2020 జూలై 26న పెద్దల సమక్షంలో పెళ్లాడిన విషయం తెలిసిందే. శాలిని నాగర్ కర్నూల్ కు చెందిన సంపత్ కుమార్, నూర్జహాన్ అనే డాక్టర్ దంపతులకు కూతురు. ఇప్పుడు వాళ్లు అమ్మమ్మ తాతయ్య అయ్యారు. మొత్తానికి కుటుంబం అంతా బుల్లి వారసుడు ఇంట్లోకి అడుగు పెట్టడంతో సంతోషంగా ఉన్నారు. ఇక తల్లి, బిడ్డ ఆరోగ్యం బాగుందని తెలుస్తోంది. మా కుటుంబంలోని సరికొత్త స్టార్‌కి స్వాగతం!!” అంటూ నితిన్ స్వయంగా ఈ వార్తను పంచుకున్నారు. ఆయన తన వారసుడి చేతిని పట్టుకున్న పిక్ ను షేర్ చేశారు.

Image

- Advertisement -

సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న నితిన్ ?

ఇన్ని బ్యాడ్ న్యూస్ ల మధ్య నితిన్ కి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఈ హీరోకి ఇటీవల కాలంలో వరుసగా డిజాస్టర్లు ఎదురవుతున్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన కెరీర్ మొదటి నుంచి కూడా ఎన్నో ఎత్తుపల్లాలను చూడాల్సి వచ్చింది. జయం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన నితిన్ ఒకానొక టైంలో ఇండస్ట్రీని వదిలేస్తాడా అన్న పరిస్థితి ఎదురైంది. అంతకంటే ముందు వరుస హిట్లు అందుకున్న ఈ హీరో ఆ తర్వాత కొంతకాలం డిజాస్టర్ ఫేజ్ ను చూడాల్సి వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై మూవీతో భారీ విజయాన్ని అందుకున్న నితిన్ ఆ తర్వాత వరుసగా ప్లాప్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇష్క్ మూవీ ఇచ్చిన బూస్ట్ తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చి పడ్డాడు అనుకుంటే ఇటీవల కాలంలో ఆయన కెరీర్ ఏమాత్రం బాలేదని చెప్పాలి.  ఇక ప్రస్తుతం నితిన్ సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నాడని వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. శాలిని తల్లి అయిన నేపథ్యంలో తన భార్య, బిడ్డతో కలిసి కొంత టైమ్ స్పెండ్ చేయడానికే ఇలా బ్రేక్ తీసుకోబోతున్నాడు అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం నితిన్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో నితిన్ ‘తమ్ముడు’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్ రాజు నిర్మాత కాగా ఈ సినిమా స్టైలిష్ యాక్షన్ డ్రామా. అలాగే వెంకీ కుడుములతో కలిసి రాబిన్‌ హుడ్ కోసం కూడా షూటింగ్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఆ తరువాత విక్రమ్ కుమార్ చిత్రాన్ని లైన్లో ఉంచాడు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ ప్రాజెక్ట్ను నిర్మించనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు