Deepika Padukone : బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ దంపతులు తల్లి దండ్రులు అయ్యారు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను ప్రెగ్నెన్సీ తో ఉన్నట్లు ప్రకటించింది దీపిక.. తాజాగా ఆమె ఈరోజు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.. దీపికకు పురిటి నొప్పులు రావడంతో ఉదయం ముంబైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు తీసుకెళ్లారు. పండంటి ఆడ్డబిడ్డకు జన్మనిచ్చారు. దీనికి సంబందించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
వీరిద్దరూ తల్లి దండ్రులు అయినట్లు జాతీయ మీడియాలో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ వార్త విన్న అభిమానులు ఆ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 2018లో దీపిక, రణవీర్ సింగ్ వివాహంతో ఒకటయ్యారు. సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా కల్కి సినిమాతో అభిమానులను అలరించిన దీపిక.. వచ్చే ఏడాది మార్చ్ వరకు ఎలాంటి షూటింగ్స్ లో పాల్గొనదని తెలుస్తోంది. ఆ తరువాత కల్కి పార్ట్ 2 లో దీపిక కనిపించనుంది. అంతేకాకుండా బాలీవుడ్ మూవీ సింగం లో మరోసారి
నటించనుంది.
ఈ దంపతులు కారులో ఆసుపత్రికి వెళ్లగా.. నిమిషాల వ్యవధిలో దీపిక, రణవీర్ సింగ్ కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే డెలివరీ కోసం వెళ్లారా లేదా నార్మల్ చెకప్ కోసం వెళ్లారా? అనేదానిపై మాత్రం ఇంకా అధికారికంగా క్లారిటీ రాలేదు. కానీ సెప్టెంబరులోనే దీపికా పదుకొణెకి డెలివరీ డేట్ను వైద్యులు ఇచ్చినట్లు మాత్రం ఈ బాలీవుడ్ దంపతులు ఫిబ్రవరిలోనే క్లారిటీ ఇచ్చారు.. అయితే వీరిద్దరూ కలిసి ప్రముఖ వినాయకుడి గుడిని సందర్శించారు దంపతులు.. ఆ తర్వాత రోజే గుడ్ న్యూస్ ను పంచుకున్నారు. ఈ వార్త విన్న ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు..