Bigg Boss 8 Telugu : తెలుగు ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన టాప్ రిలియాలిటి షో బిగ్ బాస్ ప్రస్తుతం ఎనిమిదోవ సీజన్ జరుగుతుంది. ఈ సీజన్ నిన్నటితో వారం రోజులను పూర్తి చేసుకుంది. ప్రతి సీజన్ లాగే ఈ సీజన్ కూడా వారం ముగియగానే బిగ్ బాస్ హౌస్ నుంచి ఒకరు బయటకు వచ్చేసారు. గత వారం బేబక్క ( Bebakka ) హౌస్ నుంచి బయటకు రాక తప్పలేదు. ఆమె బయటకు వెళ్తే హౌస్ మెట్స్ గురించి సంచలన విషయాలు బయట పెట్టింది.. హౌస్ లో ఎవరు ఎలాంటి వాళ్లు అన్నది ప్రేక్షకులకు చెప్పేసి బయటకు వచ్చింది. ఆమె ఎవరి గురించి ఏం చెప్పిందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
హౌస్ నుంచి బయటకు వచ్చే సమయంలో నాగ్ హౌస్ మెట్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందో అని అడిగారు. అప్పుడు ఆమె సోనియా.. జిత్తులమారి నక్క ట్యాగ్ను విష్ణుప్రియకు ఇచ్చింది. తనను ర్యాగింగ్ చేసిందని, ఏడుస్తుంటే కూడా పోక్ చేసిందని.. విష్ణుప్రియ ( విష్ణుప్రియ ).. నన్ను తిట్టి తను ఏడవడం కాలేదంటూ సోనియావి మొసలి కన్నీళ్లు అని తేలింది. సీత ( Seetha ).. నిఖిల్ను గుడ్డిగా ఫాలో అయిపోతుందంటూ ప్రేరణను గొర్రెతో పోల్చింది. బాషా.. యష్మిని ( యాష్మి ) జిత్తులమారి నక్కతో పోల్చాడు. బేబక్క.. తనను చూస్తే చాలు చిరాకు పడుతోందని సోనియాను చీమతో పోల్చింది అని అందరి గురించి బాంబ్ పేల్చింది.
ఆ తర్వాత ఎంతమంది నిజంగా బేబక్కను మిస్ అవుతారని నాగ్ ప్రశ్నించగా.. ప్రేరణ, విష్ణుప్రియ, నైనిక, సీత, ఆదిత్య, అభయ్ చేతులెత్తారు. అనంతరం ఆనవాయితీ ప్రకారం షో నుంచి వెళ్లిపోయేముందు బేబక్కతో ఓ టాస్క్ ఆడాడు. ఇంట్లో ఉండటానికి అర్హత లేనివారి రోడ్డు మీద పడేయమంది. నెగెటివ్ వైబ్స్ అంటూ సోనియాను, కోపం ఎక్కువగా ఉందని పృథ్వీ ( pruthvi )ఫోటోలను రోడ్డున పడేసింది బేబక్క. నిఖిల్ వల్లే నేను బయటకు వచ్చేశాను అంటూ బేబక్క కోపంతో రగిలిపోయింది.. ఏం చేసిన తప్పు నాదే అంటాడు అని అతని ఫోటోను రోడ్డు మీద పడేసింది. ఇకపోతే బేబక్క వెళ్తుంటే సీత వెక్కి వెక్కి ఏడ్చింది. మొత్తానికి ఒకరు బయటకు వెళ్లారు.. ఇక 13 మంది హౌస్ లో ఉన్నారు. మరి ఈ వారం ఎవరు బయట వెళ్తారో చూడాలి.. ఏది ఏమైన ఎపిసోడ్ ఇప్పుడిప్పుడే ఆసక్తిగా మారుతుంది..