Pawan Kalyan: రూ. 600 విరాళం….పవన్ కళ్యాణ్ రియాక్షన్ అదుర్స్!

 

Pawan Kalyan: ఏపీలో (AP) వర్షాలు విపరీతంగా కురవడంతో చాలామంది ఇళ్లలోకి నీళ్లు చొరబడి తీవ్ర నష్టం ఏర్పడింది. కొంతమంది ఇంట్లో ఉన్న వంట సామాన్లతో సహా అన్నింటినీ కోల్పోయారు. ఈ క్రమంలోనే చాలామంది ఏపీలో వరద బాధితులకు అండగా నిలిచి సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా విరాళాలు వస్తున్నాయి. సినీ నటులు, వ్యాపారవేత్తలే కాకుండా చాలా మంది సామాన్యులు సైతం వారికి తోచినంత డొనేషన్స్ ఇస్తున్నారు.

విరాళాలు సమర్పించే వారి కోసం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తో పాటు యూపీఐ కోడ్ సైతం ఏపీ సర్కార్ (AP) విడుదల చేసింది. అయితే అందులో వరద బాధితుల కోసం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమాని ఒకతను రూ. 600 రూపాయలు డొనేట్ చేశాడు. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా…. ఉపముఖ్యమంత్రి కార్యాలయం దీనిపై స్పందించింది. పని చేస్తే కానీ ఒక పూట గడవని స్థితిలో ఉండే ఆ వ్యక్తి వరద బాధితులకు ఎంతో కొంత సహాయం చేయాలనే తపనతో అతను చేసిన మంచి పనిపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

- Advertisement -

ఈ రోజు నేను పనికి వెళ్లి రూ. 600 రూపాయలు సంపాదించాను. ఈ డబ్బులను విజయవాడ వరద బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి చేరవేస్తున్నాను. ఆదివారం కూడా నాకు పని ఉంది. ఆ వచ్చిన డబ్బులను కూడా పంపిస్తాను. పవన్ కళ్యాణ్ గారు (Pawan Kalyan) నాకు ఎంతో స్ఫూర్తి. కష్టాలు అన్నవి అందరికీ వస్తూనే ఉంటాయి. ఆ కష్టం ఏంటో పడిన వాడికి మాత్రమే తెలుస్తుంది అంటూ గుడవర్తి సుబ్రమణ్యం అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ కు డిప్యూటీ సీఎం కార్యాలయం సైతం స్పందించి తన ట్వీట్ కు రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు