టాలీవుడ్ హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. ఈమె నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోలేకపోయినా నిధికి మాత్రం అవకాశాలను బాగానే తెచ్చిపెట్టింది. పూరి జగన్నాద్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఆఫర్ కొట్టింది. ఈ సినిమాలో రామ్ సరసన నటించిన నిధి మంచి మార్కులే కొట్టేసింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తోంది.
ఓ వైపు టాలీవుడ్లో సినిమా చేస్తూనే మరోవైపు కోలీవుడ్లో కూడా స్టార్ హీరోల సరసన నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ‘ఇండస్ట్రీలో టాలెంట్ చూసి అవకాశాలు ఇచ్చే వారు చాలా తక్కువ. అందరూ హీరోయిన్లు అందంగా ఉన్నారా లేదా ? వారు అదే చూస్తారు. రాబోయే సినిమాల్లో హీరోయిన్ల పని గ్లామర్ షో చేయడమే. గ్లామర్ కోసం ప్రేక్షకులు కూడా థియేటర్లకు వస్తుంటారు.
అందుకోసమే గ్లామర్ షో చేయడానికి నేను వెనుకాడను. పెద్ద హీరోల సినిమాల్లో అవకాశం ఇవ్వాలని ఏ దర్శకుడు అయినా వస్తే రెమ్యునరేషన్ డిమాండ్ చేయను. వాళ్లు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను. లేకుంటే నా మినిమమ్ అమౌంట్ ఇదే అని చెబుతాను. ఎందుకు అంటే పెద్దహీరోతో సినిమా చేస్తే.. ఆ తరువాత అవకాశాలు వాటంతటా అవే వస్తాయని నాకు తెలుసు’ అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది.