కమల్ హాసన్ సినిమాల పై ప్రేక్షకులకి.. ఒకప్పుడు ఉన్న మోజు ఇప్పుడు లేదు.ఒకప్పుడు అంటే ఆఫ్ బీట్ సినిమాలకి క్రేజ్ ఎక్కువ ఉండేది.. క్రమంగా అది తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు అంటే కచ్చితంగా కమర్షియల్ గా సాగాలి.అందుకే కమల్ ‘విక్రమ్’ చిత్రంలో మల్టీస్టారర్ అప్పీల్ ఉండేలా చూసుకున్నారు.లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. అయితే రిలీజ్ అవ్వకుండానే రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. ఓటీటీ, శాటిలైట్, ఆడియో రైట్స్, డబ్బింగ్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ తో కలుపుకుని ఈ చిత్రం అంత మొత్తం రాబట్టినట్లు తెలుస్తుంది. ఇది కమల్ హాసన్ కెరీర్లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీ అని చెప్పొచ్చు.
విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య వంటి స్టార్ హీరోలు కూడా ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అందుకే ఈ సినిమా పై అంత క్రేజ్ అని చెప్పాలి.ఈ చిత్రాన్ని స్వయంగా కమల్ హాసన్ నిర్మించడం మరో విశేషంగా చెప్పుకోవాలి. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన గత చిత్రాలు ‘ఖైదీ’ బ్లాక్ బస్టర్ కాగా, ‘మాస్టర్’ కూడా పర్వాలేదు అనిపించింది.అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.