Bollywood: అశ్వద్ధామ ఎన్టీఆర్ ఆ ? లేక అల్లు అర్జున్ నా ?

తెలుగు సినిమా హీరోల హవా బి-టౌన్ లో మాములుగా లేదు. ఖాన్ లని కపూర్ లని చూసి ,చూసి బోర్ కొట్టిన బాలీవుడ్ ప్రేక్షకులకి మన టాలీవుడ్ హీరోలని వాళ్ళ స్క్రీన్స్ పై చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ప్రేక్షకులే కాదు మేకర్స్ కూడా సౌత్ ఇండియన్ హీరోలతోనే సినిమాలు చేయడానికి ప్లాన్స్ వేస్తున్నారు.ఇప్పటికే వార్-2 లో ఎన్టీఆర్ అని రూమర్, మరో పక్క షారుఖ్ ఖాన్ జవాన్ లో అల్లు అర్జున్ గెస్ట్ అప్పియరెన్స్ చేస్తుండటంతో లేటెస్ట్ గా మరో న్యూస్ వైరల్ గా మారింది.

ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితి ఎలా ఉందొ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే రీమేక్ చేయాలి లేదా రీమిక్స్ చేయాలి అంతేగాని స్ట్రయిట్ సినిమా తీయడం ఇప్పుడు వాళ్ళకి కత్తి మీద సాములా మారింది. అయితే ఈ పరిస్థితి ఎవరి వల్లనో వచ్చింది కాదు వాళ్ళకి వాళ్ళు తెచుకున్నదే. పరిశ్రమ బాగుండాలంటే , ప్రతి ఒక్కరు బతకాలంటే ఎంత సేపు పెద్ద ,పెద్ద కుటుంబాల హీరోలు , దర్శకులే కాదు కొత్తవాళ్లు రావాలి. కొత్త వాళ్ళ ఆలోచనలే కొత్త సినిమా లకి ,కొత్త ఆవిష్కరణలకు పునాది అవుతుంది. కానీ ఈ విధానం బాలీవుడ్ లో లేదు ఎంతసేపు వాళ్ళే సినిమాలు చేయాలి , వాళ్ళ సినిమాలే జనాలు చూడాలి అంతే తప్ప ఇంకొకరు రారు , రానివ్వరు. పుష్కరానికో సుషాంత్ సింగ్  రాజ్ పూత్ , ఆయుష్మాన్ ఖుర్నాన  వస్తారు అంతే.

ఇక విషయానికొస్తే ఒక పెద్ద బాలీవుడ్ సంస్థ అశ్వద్ధామ జీవిత చరిత్ర ఆధారంగా ఒక సినిమాని ప్లాన్ చేస్తున్నారు. మహాభారత సంగ్రామంలో వీరోచితంగా పోరాడి ,అదే సంగ్రామం లో తుది శ్వాస విడిచిన అశ్వద్ధామ క్యారెక్టర్ బేస్ చేసుకొని ఒక సినిమా తీయబోతున్నరు. అయితే ఈ సినిమాకి ఎన్టీఆర్ ని లేక అల్లు అర్జున్ ఇద్దరిలో ఎవరినో ఒకర్ని తీసుకునే ఆలోచనలో ఉన్నారంట. ప్రస్తుతం వరుస సినిమా లతో బిజీ గా ఉన్న తారక్ , బన్నీ మరి ఈ సినిమాకి ఒకే చెప్తారో లేకా రిజెక్ట్ చేస్తారో చూడాలి.

- Advertisement -

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు