Bollywood: ఢిల్లీ కోర్టు మెట్లు ఎక్కిన బిగ్ బి మనవరాలు

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హిందీ చిత్ర పరిశ్రమ ని 3 దశాబ్దాలు ఏలిన నటుడు. ఈయన ఫ్యామిలీ గురించి కూడా మనకు తెలియందేమి కాదు. అమితాబ్ వారసుడు బాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉన్న హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అలాగే బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అభిషేక్ బచ్చన్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఇక వీరి ప్రేమకు గుర్తుగా ఆరాధ్య బచ్చన్ జన్మించింది.

అయితే ఆరాధ్యకు సంబంధించిన ఒక వార్త చాలా వైరల్ గా మారుతుంది. ఆరాధ్య బచ్చన్ కోసం బిగ్ బి ఫామిలీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంతేకాదు తన కోసం ఏకంగా ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే గతంలో ఆరాధ్య సోసిటీ లో ఎక్కువగా కనిపించేది. తరచూ ఆమె ఫోటోలు కూడా సోషల్ మీడియాలో కనిపించేవి. కానీ ఇప్పుడు ఏకంగా ఆరాధ్య ను ఇబ్బందికి గురి చేసే వార్తలు వైరల్ అవుతున్నాయి.

కొన్ని రోజుల క్రితం ఎయిర్ పోర్ట్ లో తల్లి ఐశ్వర్యరాయ్ తో కలిసి ఆరాధ్య ఉన్న ఫోటో వైరల్ అయింది. అక్కడ ఆరాధ్య ఫొటోగ్రాఫర్లను చూడగానే డిఫరెంట్ గా ఫోజులిచ్చింది. దాంతో అది వైరల్ గా మారింది. అప్పటినుండి ఆరాధ్య పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి.ఈ విషయంపై తన కూతుర్ని ట్రోల్ చేయవద్దు అంటూ అభిషేక్ బచ్చన్ కూడా రిక్వెస్ట్ చేశాడు. అయినా ట్రోల్స్ ఆగలేదు. అందువల్ల బచ్చన్ ఫ్యామిలీ, ఇంకా ఆరాధ్య పై సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు వచ్చాయి.

- Advertisement -

తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఆరాధ్య ఆరోగ్యం గురించి తప్పుడు వార్తలు ప్రచురించింది. ఆ ఫేక్ న్యూస్ పైనే మైనర్ అయిన ఆరాధ్య ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. ఇలా మైనర్ పైన తప్పుడు వార్తలు ప్రచారం చేయడం పద్ధతి కాదు అంటూ, బచ్చన్ ఫ్యామిలీ ఆరాధ్యతో కలిసి కోర్టును ఆశ్రయించారు. అయితే ఆరాధ్య వయసు కేవలం 11 సంవత్సరాలు మాత్రమే. ఈ కేసుకు సంబంధించి తొలి విచారణ ఈరోజు ఢిల్లీ హైకోర్టులో జరగబోతోంది. మరి దీనిపై హైకోర్టు ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఏది ఏమైనా సెలెబ్రిటీల ఫ్యామిలీ లో చిన్న పిల్లల పై కూడా ఇలా తప్పుడు వార్తలు రాయడం సమంజసం కాదనే చెప్పాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు