Bigboss7:
టెలివిజన్ లో బిగ్ బాస్ సీజన్ 7 లో నాలుగోవారం నామినేషన్ల ప్రక్రియ ఓ రేంజ్ లో నడుస్తుంది. అంతకు ముందు వారాల్లో నామినేషన్లలో ఎక్కువగా ఒక్కరు లేదా ఇద్దరు కంటెస్టెంట్స్ మాత్రమే హైలెట్ అయ్యేవారు. అది నెగిటివ్ గా అయినా, పాజిటివ్ అయినా.. కానీ ఫోర్త్ వీక్ లో మాత్రం కంటెస్టెంట్స్ ఒకర్ని మించి మరొకరు ఫైర్ బ్రాండ్ లా చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా లాస్ట్ వీక్స్ లో హైలెట్ అయిన యావర్, అమర్ దీప్, రతిక ఈ సారి వాళ్ళ లిమిట్స్ క్రాస్ అయినట్టు అనిపించింది.
అందులో అమర్ దీప్, యావర్ తమ నామినేషన్ల గురించి మాత్రమే వాగ్వాదానికి దిగితే, రతిక మాత్రం తనకు సంబంధం లేని దాంట్లో జోక్యం చేసుకుని మరీ పల్లవి ప్రశాంత్ పై ఫైర్ అయింది. మొదట్లో ప్రశాంత్ రతిక తో క్లోజ్ గా ఉండడం తప్పే, అయినా ఆ తర్వాత అర్ధం చేసుకుని తన లిమిట్స్ లో తాను ఉన్నాడు. ఇదిలా ఉంచితే రతిక ముందు ప్రశాంత్ తో క్లోజ్ గా ఉండి, తర్వాత యావర్ తో క్లోజ్ అయి, ఇప్పుడు ప్రియాంక, అమర్ దీప్ లతో క్లోజ్ గా ఉంది.
ఓకే.. అది తన పర్సనల్ అయినా, తాజాగా జరిగిన నామినేషన్ల గొడవ లో పల్లవి ప్రశాంత్ సరదాగా అన్నట్టు, సారీ చెప్పి లైట్ తీసుకొమ్మని అందరి ముందు అన్నా కూడా, రతిక ఒక్క సారిగా ఫైర్ అయ్యి, ‘మజాక్ చేయడానికి నేను ఎవర్రా నీకు’ అనేసింది. ఈ డైలాగ్ తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఉండగా, ఆ వీడియో కింద కామెంట్స్ లో మెజారిటీ ఆడియన్స్ రతికని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సారి ఖచ్చితంగా బిగ్ బాస్ నుండి రతిక ని ఎలిమినేట్ చేయాల్సిందేనని ప్రశాంత్ సపోర్టర్స్ అలాగే, ఒక వర్గం ఆడియన్స్ అంటున్నారు.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the
Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.