Bigboss Season7:
బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 7 మొదలైన రోజు నుండి బిగ్ బాస్ లవర్స్ తో పాటు, కామన్ ఆడియన్స్ కూడా రాత్రి తొమ్మిదింటినుండి పదకొండు అయ్యే వరకు స్టార్ మా పెట్టుకుని అలాగే చూస్తుండిపోతున్నారు. గత సీజన్ల కంటే భిన్నంగా ఈ సీజన్ ఉండడంతో బిగ్ బాస్ 7 పై ఇంట్రెస్ట్ మరింత పెరిగిపోతుంది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ షో లో ఏ సీజన్లో అయినా ఒకరు ఏడవడం కామన్. కొందరు సందర్భానుసారం కన్నీళ్లు పెట్టుకున్నా, మరికొందరు అదే పనిగా ఏడుస్తూ ఉంటారు.
ఈ సీజన్లో అలా ఎక్కువసార్లు చేసింది పల్లవి ప్రశాంత్. తనే గాక, దామిని, శోభా శెట్టి, యావర్ కూడా కొన్ని సార్లు ఏడ్చారు. అయితే ఇప్పటివరకు ఈ సీజన్లో డీసెంట్ ప్లేయర్ గా ఉన్న శుభ శ్రీ కూడా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. నిజానికి శుభ శ్రీ ఈ సీజన్లో బెస్ట్ ప్లేయర్ అని కొందరి నెటిజన్ల అభిప్రాయం. ఎందుకంటే సీజన్ స్టార్ట్ అయినప్పటి నుండి, ఎవరితోనూ పెద్దగా గొడవలు పడకుండా, వాగ్వాదాలు పెట్టుకోకుండా, షోలో ఆడుతూ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తూ వచ్చింది.
పైగా కొన్నిసార్లు రతిక, ప్రశాంత్ ల మధ్య గొడవలు ఆపేందుకు తాను చేసిన ప్రయత్నంతో అందరి మనసులు గెల్చుకుంది. అలాంటిది ఎప్పుడు లేనిది అమర్ దీప్ నామినేషన్ వల్ల ఫస్ట్ టైం ఏడ్చేసింది. ఈ నామినేషన్లో ప్రాపర్ రీసన్ లేకుండా నామినేట్ ఎలా చేస్తారు అంటూ, వెక్కి వెక్కి ఏడ్చేసింది. అటు అమర్ దీప్ కూడా శుభ శ్రీ అన్నదానికి బాగానే హర్ట్ అయినట్లు తెలుస్తుంది. అయితే నాలుగో వారం ఎలిమినేషన్ చాలా కష్టంగా ఉంటుందని తెలుస్తుంది.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the
Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.