Lawrence: పెళ్లి చేసుకునే ఫ్యాన్స్ కి లారెన్స్ శుభవార్త.. ఆ కష్టం లేకుండా..!

ప్రముఖ కొరియోగ్రాఫర్ గా తన కెరియర్ ను మొదలుపెట్టి టాలీవుడ్, కోలీవుడ్ లో ఇప్పుడు నటుడిగా దర్శకుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్న లారెన్స్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. వరుస సినిమాలు చేస్తూ అటు తెలుగు ఆడియన్స్ ను కూడా మరింతగా మెప్పిస్తున్న ఈయన పారితోషకాన్ని కూడా భారీగానే తీసుకుంటూ ఉంటారు. అయితే తన సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తూ అటు సమాజసేవ కూడా చేస్తుంటారు. ఇదిలా ఉండగా తాజాగా భవిష్యత్తులో పెళ్లి చేసుకోబోయే తన అభిమానులకు అదిరిపోయే శుభవార్త తెలిపారు లారెన్స్.

తాజాగా ఈయన జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ని సొంతం చేసుకుంది. మరోవైపు ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ కూడా ఇస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 8వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఇకపోతే వేర్వేరు రీజన్ ల వల్ల థియేటర్లలో సినిమా చూడడం మిస్సయిన వారు ఇకపై ఓటిటి ద్వారా ఈ సినిమా చూడవచ్చు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించ. అయితే తాజాగా లారెన్స్ మాట్లాడుతూ.. జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమా మంచి విజయాన్ని సాధించింది.. ఈ సినిమాకి అసలైన హీరో కార్తీక్ సుబ్బరాజు.. దేవుడు ఆశీస్సులు ఉండడం వల్ల ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది అంటూ తెలిపారు అభిమానుల ప్రోత్సాహాన్ని మరిచిపోలేనని అభిమానులంతా తన కుటుంబ సభ్యులేనని లారెన్స్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇక అంతేకాదు తన తల్లి పేరుపై కన్మణి కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నానని ..ఈ కళ్యాణ మండపంలో అభిమానులు ఉచితంగా వివాహం చేసుకోవచ్చని తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఒక అభిమాని సరైన వసతి లేని ఇంట్లో పెళ్లి చేసుకుంటున్నాడు అని తెలిసి ఈ నిర్ణయం తాను తీసుకున్నానని లారెన్స్ వెల్లడించారు. వంట వండడానికి వంట పాత్రలతో సహా అన్ని సౌకర్యాలు ఉంటాయని మండపం చాలా అద్భుతంగా నిర్మిస్తామని కూడా తెలిపారు లారెన్స్ . మొత్తానికైతే అభిమానుల కోసం లారెన్స్ తీసుకున్న నిర్ణయానికి అందరూ ఫిదా అవుతున్నారు.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు