Parineeti Chopra : 15 కిలోలు పెరిగిన పరిణీతీ చోప్రా.. తగ్గేందుకు ఎంత కష్టపడుతుందో తెలుసా..?

బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న భామ పరిణితి చోప్రా గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. అక్క ప్రియాంక చోప్రా స్టార్ హీరోయిన్ ఐనా కూడా ఆమె పేరు వాడుకోకుండా సొంతంగా వచ్చింది ఈ భామ. రావడమే కాకుండా మంచి విజయాలను అందుకొని స్టార్ హోదా కూడా అందుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఆప్ ఎంపీ రాఘవ్ ఛద్దాతో ఆమె వివాహం అక్టోబర్ నెలలో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో అంగరంగ వైభవంగా జరిగింది.

దీంతో సినిమాలకన్నా ఈమె ఇతర విషయాలతోనే సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. ఇదిలా ఉంటే.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో యానిమల్ సినిమాలోని గీతాంజలి పాత్రకు ముందుగా పరిణితి చోప్రా ని తీసుకున్నారు. 2021లో ఈ సినిమాను ప్రారంభించినప్పుడు పరిణితి చోప్రా నటించేందుకు ఒప్పుకుంది. కానీ ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రూపొందే అమర్ సింగ్ చమ్కీలా సినిమా రెండు ఒకేసారి షూటింగ్ చేయాల్సి వచ్చింది. దీంతో యానిమల్ సినిమాను వదులుకొని చమ్కీలా సినిమాకి ఓటు వేసింది పరిణీతి.

ఈ మధ్యే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. అయితే ఈ చిత్రంలోని క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ గా ఫీట్ అయ్యేందుకు 15 కేజీలు పెరిగిన ఈ బ్యూటీ.. ఏ ఆర్ రెహమాన్ స్టూడియోలో పాటలు పాడడం, ఇంటికి వెళ్లి జంక్ ఫుడ్ లాగించడంతో ఈ ఆరు నెలలు గడిపానని చెప్పింది. ఇప్పుడు షూటింగ్ పూర్తి కావడంతో మళ్ళీ సన్నగా అయ్యేందుకు జిమ్ కి వచ్చానని.. ఇదంతా ఇంతియాజ్ కోసమే చేసినట్లు తెలిపింది. ఇక ఈ చిత్రం త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రస్తుతం పరిణీతి జిమ్ లో వర్కౌట్ చేసిన వీడియోని షేర్ చేయడంతో వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు