Pindam: ఆసక్తి రేపుతున్న పిండం ట్రైలర్.. ఈ ట్విస్ట్ మాత్రం మిస్ కావద్దు..!

ప్రేక్షకులను ఎప్పుడూ కామెడీ తోనే కాదు హార్రర్ తో కూడా భయపెట్టడానికి సిద్ధం అంటున్నారు శ్రీకాంత్ శ్రీరామ్, అవసరాల శ్రీనివాస్.. ఇప్పటివరకు తమ కామెడీతో ప్రేక్షకులను అలరించిన వీరు ఇప్పుడు పిండం అనే హార్రర్ మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు. తమిళ నటుడు శ్రీకాంత్ శ్రీరామ్ కి తెలుగులో మంచి పేరుంది. మరొకవైపు దర్శకుడిగా, నటుడిగా కూడా అవసరాల శ్రీనివాస్ విభిన్న కథలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. తాజాగా వీరిద్దరి కాంబోలో వచ్చిన హారర్ థ్రిల్లర్ చిత్రమే పిండం.. కళాహి మీడియా బ్యానర్ పై ఈ చిత్రాన్ని యశ్వంత్ దగ్గుమాటి నిర్మించారు. ఇక ఈ నెలలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా సినిమా ప్రమోషన్స్ చేపట్టిన చిత్ర బృందం అందులో భాగంగానే ట్రైలర్ ని కూడా విడుదల చేశారు .

ఈ ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ పిండం సినిమా ట్రైలర్ విషయానికి వస్తే.. మరణం తర్వాత ఏం జరుగుతుంది ? ఆత్మలు తమ కోరికలు తీరకపోతే భూమిపైనే ఉంటాయా? అనే ప్రశ్నతో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. అంతేకాదు ఆత్మలు నిజంగానే మనుషులకు హాని చేస్తాయా? అనే కోణంలో సినిమాను చాలా హర్రర్ గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ట్రైలర్ లో ఏముంది అనే విషయానికొస్తే.. ఊరికి దూరంగా ఉన్న ఒక ఇంటిలోకి శ్రీరామ్ తన తల్లి, భార్య, పిల్లలతో దిగుతాడు. ఒకరోజు ఇంటిలో అనుమాన సంకేతాలు కనిపించడం.. అంతలోనే అతని చిన్న కూతురు తనతో ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తోందని తల్లితో చెప్పడం.. అప్పటినుంచి ఇంట్లో అలా వరుస ఘటనలు జరుగుతూనే ఉంటాయి.

ఇక ఈ విషయాన్ని అతీత శక్తులు ఉన్న ఈశ్వరీ రావు సమస్య ఉందని గుర్తిస్తుంది. ఇక శ్రీరామ్ చిన్న కూతురుకి ప్రమాదం ఉందని ఆమె చెబుతుంది. అందులో భాగంగానే మహాలయ అమావాస్య రోజు సమస్యను పరిష్కరించడానికి కొన్ని పూజలు కూడా చేయాలి అని.. ఆ రోజు కుదరకపోతే మళ్లీ ఒక ఏడాది పాటూ వేచి ఉండాల్సి వస్తుందని చెబుతుంది. అయితే ఆరోజు పూజ చేశారా.. చేస్తే పరిష్కారం దొరికిందా ? లేదా? ఇంతకీ శ్రీరామ్ చిన్న కూతురుతో మాట్లాడుతున్నది ఎవరు? నిజంగా ఆత్మలేనా? ఇలా ఎన్నో సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే సినిమా వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

- Advertisement -

అయితే నిజజీవితంలో జరిగిన కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అందుకే ఈ సినిమాపై అందరి అంచనాలు పెరిగిపోయాయి. ఒక వస్తువును పూడ్చిన , తగలబెట్టిన దానిలోని అంతర్గత ఎనర్జీని ఎప్పటికీ నిర్మూలించలేము అంటూ ట్రైలర్ చివరలో చెప్పిన సైంటిఫిక్ రీజన్స్ అన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. సాయికిరణ్ దైడ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు