తాజాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు వారసుడు దగ్గుబాటి అభిరామ్ శ్రీలంకలో నిన్న అంగరంగ వైభవంగా తన మరదలు ప్రత్యుష ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇక అందరూ కూడా కొత్త జంటను ఆశీర్వదించడంతోపాటు శుభాకాంక్షలు తెలియజేస్తున్న నేపథ్యంలో ప్రముఖ నటి శ్రీరెడ్డి మాత్రం విచిత్రంగా స్పందించింది. నటిగా కెరియర్ ఆరంభంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు దగ్గుబాటి అభిరామ్ తనను మోసం చేశాడని ఆరోపించిన ఆమె గతంలో సోషల్ మీడియాలో కూడా ఇదే వార్తలను బయటపెడుతూ భారీగా వైరల్ అయిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా మరోసారి అభిరామ్ , అతని కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో పరోక్షంగా స్పందించింది. “రాముడు.. సీతను విడదీసిన భూమి.. సీత శాపాలకు నిలయం.. ఆంజనేయుడు ఆగ్రహానికి గురైన భూమి.. అశోక వనంలో సీతమ్మ అన్నం మానేసి, స్నానం మానేసి రాముడి కోసం రోధించిన రాక్షస లంక.. శ్రీలంకలో దగ్గుబాటి అభిరామ్ కి పెళ్లి.. మన దేశ ఆదర్శ జంట రాముల వారిని సీతమ్మ వారిని విడదీసిన దేశంలోనా నీ పెళ్లి..? ఆహా.. దైవ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను.. ఎప్పటికైనా రాక్షసులు రాక్షసులే ” అంటూ తన ఫేస్బుక్లో పోస్టుని షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ పోస్ట్ చేసిన వెంటనే నిటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
నువ్వు సీతవేంటి? నీ పోస్ట్ చూడడం మా దరిద్రం .. నిన్ను నువ్వు సీతతో పోల్చుకున్నావు చూడు.. ఇది కర్మ.. అంటూ చాలా దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే శ్రీ రెడ్డి దగ్గుబాటి అభిరామ్ పై చేస్తున్న కామెంట్లు వైరల్ అవుతుండగా.. మరొకవైపు శ్రీరెడ్డిపై నెటిజెన్లు ఈ రకంగా విరుచుకుపడుతూ ఉండడం మరింత హాట్ టాపిక్ గా మారింది. మరి నెటిజన్ల కామెంట్లకు శ్రీరెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇక దగ్గుబాటి అభిరామ్ విషయానికి వస్తే.. అహింసా సినిమాతో వెండితెరకు పరిచయమై.. ఈ సినిమాతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో సరైన కథ కోసం ఎదురుచూస్తున్న సమయంలో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఆరంభించాడు.. ఇక ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి అద్భుతమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.