Sriwass : డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితోనే మళ్ళీ రిస్క్

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో శ్రీవాస్ ఒకడు. 2007లో లక్ష్యం సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీ వాస్. అయితే గోపీచంద్, జగపతిబాబు, అనుష్క శెట్టి నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించింది. ఆ తర్వాత శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో రామ రామ కృష్ణ కృష్ణ అనే సినిమాను తెరకెక్కించాడు శ్రీవాస్ అయితే ఈ సినిమా కూడా మంచి హిట్ ను సాధించింది. ఇప్పటికి శ్రీవాస్ బెస్ట్ వర్క్స్ లో ఇదొకటి అని చెప్పొచ్చు.

ఆ తర్వాత చేసిన పాండవులు పాండవులు తుమ్మెద సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా భారీ తారాగణంతో తెరకెక్కింది. మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్, ప్రణీత, వరుణ్ సందేశ్, రవీనా టండన్ లాంటి ప్రముఖులు అందరూ నటించారు. అయితే ఇప్పటివరకు శ్రీవాస్ చేసిన సినిమాలన్నీ కూడా విజయాన్ని సాధించాయి. అంతే తప్ప శ్రీవాస్ ను ఒక బ్రాండ్ డైరెక్టర్ గా అయితే నిలబెట్టలేకపోయాయి.

ఇక పాండవులు పాండవులు తుమ్మెద సినిమా తర్వాత చేసిన లౌక్యం సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత ఇప్పటికి వరకు ఇలాంటి హిట్ సినిమా ఇంకా గోపీచంద్ కెరియర్ లో రాలేదు. శ్రీవాస్ కి కూడా ఇదే లాస్ట్ హిట్ సినిమా అని కూడా చెప్పొచ్చు. ఆ తర్వాత బాలయ్య బాబుతో చేసిన డిక్టేటర్ సినిమా కూడా పరవాలేదు అనిపించుకుంది.

- Advertisement -

ఇకపోతే బెల్లంకొండ శ్రీనివాస్ పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా చేసిన సినిమా సాక్ష్యం. ఈ సినిమా ఒక యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇకపోతే మళ్ళీ గోపిచంద్ తో హ్యాట్రిక్ కాంబినేషన్లో వచ్చిన సినిమా రామబాణం. ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.

అయితే ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఇదే దర్శకుడుతో మరో సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ దర్శకుడును నమ్మి దాదాపు 75 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. శ్రీవాస్ తీసిన సినిమాలు ఒక మోస్తరుగా ఆడాయి తప్ప బ్రాండ్ డైరెక్టర్ గా శ్రీవాస్ కి అయితే ఆ సినిమాలేవి గుర్తింపు తీసుకురాలేదు. అయితే ఇంత మనీని ఈ దర్శకుడు పైన పెడుతున్నారంటే ఎటువంటి పవర్ఫుల్ సబ్జెక్టు ను శ్రీవాస్ రెడీ చేశాడా అని చాలామందికి ఒక రకమైన క్యూరియాసిటీ ఏర్పడుతుంది.

ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌసెస్ లో మైత్రి మూవీ మేకర్స్, స్వప్న సినిమాస్, హారిక హాసిని క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ వీటితో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా చాలా త్వరగా సినిమాలను చేస్తూ అగ్ర నిర్మాణ సంస్థగా ఎదుగుతుంది. ఈ ప్రొడక్షన్ హౌస్ లో కూడా గూఢచారి , కార్తికేయ ,ధమాకా వంటి సినిమాలు వచ్చాయి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు