Bigg Boss : 18 ఏళ్లకే ఆ పని చేసిన నటి.. ఇప్పుడు ఆమె ఆస్తుల విలువ కోట్లు.. అసలు నిజం ఇదే?

Bigg Boss : ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ కొంతమందే నిలదొక్కుకుంటారు. కొంతమంది అవకాశాల కోసం ఇప్పటికీ ట్రై చేస్తున్నా, మరి కొందరు తమ టైం అయిపోయిందని గ్రహించి అన్ని రంగాల్లోనూ అవకాశాలని సద్వినియోగం చేసుకుంటారు. అలాగే ఓ సీరియల్ హీరోయిన్ కూడా ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో కష్టాలని అనుభవించింది. పలు విమర్శలు కూడా ఎదుర్కొన్న ఆ హీరోయిన్ బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయి, భోజ్ పురి సినిమాల్లో ఓ వెలుగు వెలిగింది. ఇప్పుడు సినిమాల్లోనూ రానిస్తుంది. ఆమె పేరు శ్వేతా తివారి. ఈ పేరు ఇక్కడ పెద్దగా విని ఉండరు. కానీ బాలీవుడ్ లో మాత్రం సంచలనం. టెలివిజన్ సీరియళ్ళలో వెరీ ఫేమస్. టివి నుండి స్టార్ అయిన నటీమణుల్లో ఈమె ఒకరు.

Bigg Boss 4 season Winner Shwetha Tiwari life story

18 ఏళ్లకే ఆ పని..

ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన శ్వేతా తివారి కేవలం 12 సంవత్సరాల వయస్సులోనే చిత్ర పరిశ్రమలోకి వచ్చింది. భోజ్‌పురి చిత్రాలతో తన కెరీర్‌ను ప్రారంభించిన శ్వేతా తివారి ఆ తర్వాత, హిందీ సీరియల్స్ లో బాలీవుడ్ చిత్రాలలో మంచి పేరు తెచ్చుకుంది. ‘కసౌటి జిందగీ కె’ సీరియల్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈమె చిన్న వయసులోనే పెద్ద జీవితాన్ని చూసింది. సీరియల్స్ లో నటిస్తూ కెరీర్ బిగినింగ్ టైం లోనే అంటే కేవలం 18 ఏళ్లకే ఈమె పెళ్లి కూడా చేసుకుంది. 1998 లో బాలీవుడ్ నటుడు రాజా చౌదరిని శ్వేతా తివారి ప్రేమించి పెళ్లిచేసుకుంది. అంతే కాదు కేవలం 19 ఏళ్ళ వయసులో బిడ్డకు కూడా తల్లయింది. ఈ జంటకు పాలక్ తివారి అనే పాప. అయితే విభేదాల కారణంగా 2007 లో శ్వేతా తివారి, రాజా చౌదరి విడిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్ళు సీరియల్స్ లో బిజీ అయిన శ్వేతా తివారి మళ్ళీ రెండోసారి ప్రేమలో పడింది. 2013 లో అభివన్ కోహ్లీ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి రేయాన్ష్ కోహ్లీ అనే కొడుకు ఉన్నాడు. కానీ అతనితో కూడా పోరు పడలేక వేధిస్తున్నాడంటూ కోర్టుకు ఎక్కి మరీ 2019 లో విడాకులు తీసుకుంది.

- Advertisement -

కోట్లు సంపాదించిన శ్వేతా..

అయితే శ్వేతా తివారి కెరీర్ లో ఎదగడానికి ఎన్నో కష్టాలు పడిందని అంటారు. ఇద్దర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయినా, అది ఆమె వ్యక్తిగత విషయమైనా, ఇండస్ట్రీలో ఎదగడానికి మాత్రం బాగానే కష్టపడింది. భోజ్ పూరి సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసి, కసౌటి జిందగీ కె ‘ లో ప్రేరణ శర్మ పాత్రతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత హిందీ (Bigg Boss) బిగ్ బాస్ సీజన్ 4 లో పోటీ చేసి, ఏకంగా ఆ సీజన్ విన్నర్ గా నిలిచి, సీరియల్ హీరోయిన్ గా మంచి ఆఫర్లు అందుకుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఈమెకి అంతగా గుర్తింపు రాలేదు. కానీ సీరియల్స్ లో మాత్రం ఓ రేంజ్ మెయింటైన్ చేసింది. ఎంతలా అంటే దశాబ్దం వరకు హిందీ సీరియల్స్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. సినిమాల్లో సీరియల్స్ ద్వారా బాగానే సంపాదించిన శ్వేతా తివారి ఆస్తుల విలువ ఏకంగా 81 కోట్లకి పైగా ఉంటుందని సమాచారం. ఒక సీరియల్ నటికి ఈ స్థాయిలో ఆస్తులున్నాయంటే మామూలు విషయం కాదు.

అయితే రెండు సార్లు ప్రేమించి మోసపోయిన శ్వేతా తివారి ప్రస్తుతం తన కూతురు పాలక్ తివారీ, కొడుకు రేయాన్ష్ కోహ్లీ తో ఒంటరిగానే ఉంటుంది. ఇక శ్వేతా చివరిసారిగా రోహిత్ శెట్టి తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’లో కనిపించగా, ప్రస్తుతం అజయ్ దేవగన్ ‘సింగం ఎగైన్’ లో నటిస్తోంది. ఇప్పుడు హీరోయిన్లుగా నటించకపోయినా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి ఆఫర్లు అందుకుంటుంది. వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా, సినిమాల్లో మాత్రం కష్టపడి ఎదిగి బాగానే ఆస్తులు ఎనకేసుకుని అప్ కమింగ్ హీరోయిన్లకి ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది శ్వేతా తివారి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు