Bigg Boss 8 Telugu Day 3 Promo 2: పృథ్వీ ఫైర్.. హీటెక్కిన షో.. అంతా వారి వల్లే..!

Bigg Boss 8 Telugu Day 3 Promo 2.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదటి వారం నామినేషన్ రచ్చ ఇంకా కొనసాగుతోంది. మొదటి వారమే కంటెస్టెంట్స్ మధ్య హీటెక్కించే డిస్కషన్స్ ఆడియన్స్ లో ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా మొదటి నుంచి ఒంటరిగా ఉంటున్న నాగమణికంఠను హౌస్ మేట్స్ టార్గెట్ చేస్తూ మరీ నామినేట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎవరితోనూ కలవడం లేదు, మాట్లాడడం లేదు, కెమెరాతో మాత్రమే మాట్లాడుతున్నారు అంటూ ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఇదే రీసన్ చెప్పి, అతడిని నామినేట్ చేశారు. ఫస్ట్ నామినేట్ లిస్టులో ఉన్నది కూడా మణికంఠ కావడం గమనార్హం.

Bigg Boss 8 Telugu Day 3 Promo 2: Prithvi Fire.. The hit show.. All because of them..!
Bigg Boss 8 Telugu Day 3 Promo 2: Prithvi Fire.. The hit show.. All because of them..!

మణికంఠ ను టార్గెట్ చేసిన హౌస్ మేట్స్..

సింపథీ గేమ్ మొదలు పెట్టేసిన మణికంఠ ఈరోజు విడుదలైన మొదటి ప్రోమోలో కూడా తన లైఫ్ స్టోరీ చెబుతూ అందరిని ఏడిపించేశాడు. దీంతో యశ్మీ, ప్రేరణ సహా అమ్మాయిలు అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు .ఇక ఇప్పుడు విడుదలైన రెండో ప్రోమోలో కూడా హౌస్ లో ఉండేందుకు ఇతడు పనికి రాడు అని, అన్ఫిట్ అని నెగటివ్ పర్సన్ అని, మణికంఠ పై ఫైర్ అయ్యాడు పృథ్వీ. హౌస్ లోకి వచ్చిన మొదటి రోజు నుంచి సింపథీ గేమ్ ఆడుతున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొదటి రోజు నుంచి హౌస్ లో సైలెంట్ గా ఉంటూ వచ్చిన పృథ్వీ మొత్తానికి నామినేషన్ లో మాత్రం గట్టిగానే సీరియస్ అవుతూ కామెంట్లు చేశారు. ఒకవైపు మణికంఠ మరొకవైపు బేబక్కలపై పూర్తిస్థాయిలో విరుచుకుపడ్డాడు.

మణికంఠకు కౌంటర్ ఇచ్చిన అభయ్..

ముందుగా అభయ్ మాట్లాడుతూ.. హౌస్ లో ఎవరు ఏం చేసినా సరే, నేను చూస్తా, అది నా పాయింట్ కాకపోయినా నేను మాట్లాడతాను అంటూ అందరికీ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు ఎవడు ఫేక్ గా ఉన్నాడు. ఎవరు మంచిగా ఉన్నారు. అసలు ఒరిజినల్ క్యారెక్టర్ ఎవరు అని ఆడియన్స్ చూసుకుంటారు అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ప్రేరణ మాట్లాడుతూ.. మణికంఠకు కౌంటర్ ఇచ్చింది. మీ పాస్ట్ చెప్పేసి బాధపడితే మేము ఏమైపోం అంటూ సీరియస్ అయ్యింది. దీంతో నేను గేమర్ గానే వచ్చా అని మణికంఠ అనడంతో వెంటనే అబ్బాయి క్లాస్ కొట్టి ఇది నీ గేమ్ ప్లాన్ అని, ఒప్పుకున్నందుకు నిన్ను అభినందిస్తున్నాను అంటూ చెప్పడంతో మణికంఠ షాక్ అయ్యాడు.

- Advertisement -

మణికంఠ వర్సెస్ పృథ్వీ..

అలాగే మణికంఠ వర్సెస్ పృథ్వీ. వీరిద్దరి మధ్య మాటలు యుద్ధం నడిచింది. ముందుగా బేబక్కను నామినేట్ చేసిన పృథ్వీ. ఆ తర్వాత మణికంఠను నామినేట్ చేస్తూ అసలు ఇతడు హౌస్ లో ఉండడానికి పనికిరాడు. సింపథీ గేమ్ ఆడుతున్నాడు. అసలు నువ్వే ఒక నెగిటివ్ పర్సన్ అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ ఎపిసోడ్ లో కూడా మణికంఠకే ఎక్కువగా నామినేషన్ పడ్డట్టు తెలుస్తోంది. ఏదైమైనా ఈసారి సైలెంట్ గా ఉంటూ వచ్చినప్పుడు పృథ్వీ ఒక్కసారిగా ఫైర్ అయ్యాడని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు