Biggboss season7: దేనికి పనికిరాను.. అంటూ మళ్ళీ ఏడుపు?

బిగ్ బాస్ సీజన్ 7 లో లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ మొదలైందన్న సంగతి తెలిసిందే. ఈ వారం జరిగే కెప్టెన్సీ టాస్క్ చివరిది అని బిగ్ బాస్ చెప్పడం వల్ల అందరూ తమ తమ ఫెయిర్ గేమ్ తో, తమ కిష్టమైన వాళ్లనే కెప్టెన్ ని చేయాలనీ ఒక్కొక్కొర్ని బయటికి తీసేస్తున్నారు. అయితే ఈ గేమ్ నుండి ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్ బయటికి రావడం కంఫర్మ్ అయిపోగా, చివరగా, ముగ్గురి మధ్యలో నామినేషన్ పెండింగ్ లో ఉంది.

ఇదిలా ఉండగా అమర్ దీప్ ముందునుండి కెప్టెన్ కావాలని ఎన్నోసార్లు ట్రై చేస్తున్నాడని తెలిసిందే. అయితే కొన్ని సార్లు ఆట మిస్ ఫైర్ అవగా, మరి కొన్ని సార్లు ఆట చివరిదాకా వచ్చి ఓడిపోయాడు. లాస్ట్ టైం కూడా కొద్దిలో ఊడిపోగా, ప్రియాంక కెప్టెన్ అయ్యింది.

అయితే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్నప్పుడు అమర్ దీప్ తనని ఆడనివ్వండని, కెప్టెన్ కావాలని తన కల అని మళ్ళీ బతిమిలాడడం స్టార్ట్ చేసాడు. దానికి బోనస్ గా ఏడవడం కూడా మొదలు పెట్టాడు. అయితే బిగ్ బాస్ లో అమర్ ఇలా ఏడవడం ఫస్ట్ టైం కాదు, ఇంతకు ముందు ఏడుపు మారాజు అని పల్లవి ప్రశాంత్ ని అనే ఆడియన్స్, ఇప్పుడు అమర్ ని ట్రోల్ చేస్తున్నారు.

- Advertisement -

మరీ ముఖ్యంగా బిగ్ బాస్ లో కొన్ని వారాల కింద నేను దేనికి పనికిరాను, వ్యర్థపదార్ధాన్ని అంటూ సెల్ఫ్ ట్రోలింగ్ వేసుకున్న అమర్, మరో సారి అలాంటి కామెంట్స్ చేసి మరింత దిగజారాడు. దేనికి పనికిరాను, సిక్స్ ప్యాక్ లు, బాడీలు పెంచిన వాళ్ళకే కెప్టెన్సి ఇస్తారని అనడం స్టార్ట్ చేసాడు. ఈ సీన్ చూస్తున్న బిగ్ బాస్ ఆడియన్స్ లో ఓ వర్గానికి నవ్వాలో, జాలి పడాలో తెలీడం లేదు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు