Bigboss Season 8 : నాగమణికంఠ జనాలని గొర్రెలని చేద్దామని ఫిక్స్ అయి వచ్చాడు

Bigg Boss season 8: బిగ్ బాస్ షో గురించి మన ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది అలరించే షో అంటే బిగ్ బాస్ అని చెప్పొచ్చు. సెలబ్రిటీలు అందరూ కలిసి టెక్నాలజీకి దూరంగా సోషల్ మీడియాకు దూరంగా ఒకే దగ్గర జీవిస్తే ఎలా ఉంటుంది అని సాధారణ ప్రేక్షకులకి చూపించే సో ఈ బిగ్ బాస్. అయితే నిజ జీవితంలో సెలబ్రిటీలు ఎలా మాట్లాడుతారు ఎలా ఉంటారు వాళ్ళు ప్రవర్తించే తీరేంటి అని ఈ షో చూస్తే చాలామందికి తెలుస్తుంది. చాలామంది మీ ఆలోచన విధానం ఈ షో ద్వారా బయటపడుతుందని చెప్పొచ్చు.

దాదాపు ఇప్పటివరకు బిగ్ బాస్ షో కి సంబంధించి ఏడు సీజన్లు అయ్యాయి. ఇక ఎనిమిదవ సీజన్ కూడా మొదలుకానుంది. ఈ షో కి సంబంధించి మొదటి సీజన్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. ఆ సీజన్ అద్భుతంగా వర్కౌట్ అయింది ఆ తర్వాత నాని చేసిన సీజన్ 2 కూడా బాగానే వర్కౌట్ అయింది. ఒక బిగ్ బాస్ సీజన్ 3 నుంచి నాగార్జున హోస్ట్ గా ఉండడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు కూడా హోస్ట్ గా నాగార్జున కొనసాగుతున్నారు. ఇకపోతే మొదటి షో అలరించినంతగా రిమైనింగ్ సీజన్స్ ఏవి కూడా ఆకట్టుకోలేకపోయాయి.

బిగ్బాస్ జరుగుతున్న కొద్దీ సీజన్స్ పెరుగుతున్నకొద్దీ తెలిసిన వాళ్లకంటే కూడా తెలుసుకోవలసిన వాళ్లు ఎక్కువైపోయారు అనేటట్లుంది కంటెస్టెంట్లు పరిస్థితి. ఇకపోతే ఈ షో లో నాగ మణికంఠ కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేస్తున్నాడు. అయితే ఒకప్పుడు పల్లవి ప్రశాంత్ ఎలా డ్రామా చేసి జనాలను గొర్రెలను చేసాడో, ఇప్పుడు నాగమణికంఠ కూడా అదే విధంగా చేస్తున్నాడు. అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందర్నీ ఎమోషనల్ గా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు నాగమణికంఠ. సమయం దొరికిన ప్రతిసారి కన్నీటి కుళాయి విప్పుతున్నాడు.

- Advertisement -

Naga Manikanta

ఇక పల్లవి ప్రశాంత్ గురించి చెప్పక్కర్లేదు. బిగ్బాస్ లో రైతు బిడ్డగా అడుగుపెట్టి కేవలం రైతులను తక్కువ చూపు చూస్తున్నారు, అని కింద పడిన మెతుకులు కూడా తినడం మొదలుపెట్టాడు. అయితే మొత్తానికి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ గెలిచిన కూడా చాలామంది జనాలను గొర్రెలు చేశాడు అంటూ ఉంటారు. ఇప్పుడు నాగమణికంఠ కూడా అదే విధంగా చేస్తున్నాడు అని చాలామంది అభిప్రాయం. ఏదేమైనా ముందు సీజన్స్ లాగే ఈ సీజన్ కూడా ముందు ముందు ఆసక్తిగా మారనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు