Bigg Boss Season 8 Telugu : హౌజ్ లో పద్మవ్యూహం… విన్నర్ కావాలంటే ఆ పని చేయాల్సిందే

Bigg Boss Season 8 Telugu : పాపులర్ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు టెలివిజన్ ఆడియన్స్. ఇక మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతున్న తాజా సీజన్ కు సంబంధించిన ప్రోమోను హోస్ట్ నాగార్జున సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఉత్సాహాన్ని పెంచేశారు. అయితే ఇప్పటిదాకా అసలు హొస్ట్ గా నాగార్జున చేస్తారా లేదా అన్న అనుమానాలు నెలకొనగా, తాజా ప్రోమోతో ఆయనే ఈసారి కూడా హోస్ట్ చేయబోతున్నాడు అనే విషయంపై క్లారిటీ వచ్చింది. అయితే ఈ ప్రోమో కారణంగా సీజన్ 8 కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ పని చేస్తేనే విన్నర్…

ఇప్పటిదాకా ఏడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ కొత్త సీజన్ త్వరలోనే మొదలు కాబోతోంది. అయితే ఈసారి సీజన్ 8 గతంలో వచ్చిన అన్ని సీజన్ల కంటే డిఫరెంట్ గా ఉండాలని మేకర్స్ సరికొత్తగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పటిలాగే హౌస్ లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో పాటు ఈసారి హాట్ బ్యూటీలను కూడా రంగంలోకి దింపబోతున్నారని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విన్నర్ కావాలంటే మాత్రం సీజన్ 8లో ఆ ఒక్క పని చేసి తీరాల్సిందే. దీనికోసం కంటెస్టెంట్స్ కు గట్టి పరీక్ష పెట్టబోతున్నారు మేకర్స్. ఈసారి బిగ్ బాస్ షోలో ఒకటి కాదు రెండు హౌస్ లు ఉంటాయని రూమర్స్ నడుస్తున్నాయి.

Bigg Boss Telugu 8: బిగ్‏బాస్ 8 ప్రోమో వచ్చేసింది.. అసలు విషయం చెప్పేసిన హోస్ట్ నాగార్జున.. - Telugu News | Nagarjuna Shared Bigg Boss Season 8 Telugu Promo, watch the video | TV9 Telugu

- Advertisement -

తాజాగా నాగ్ రిలీజ్ చేసిన ప్రోమో ఈ వార్తలకు కారణమైంది. ఆ లోగోను చూస్తుంటే ఈసారి సీజన్లో కొత్తగా రెండు హౌస్ లు ఉండబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఒకటి డూప్ హౌస్ కాగా, రెండోది మెయిన్ హౌస్ అని టాక్ నడుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు హౌస్ లో కంటెస్టెంట్స్ ముందుగా డూప్ హౌస్ లోకి కాలు పెడతారు. మెయిన్ హౌస్ లోకి అడుగు పెట్టాలంటే వీళ్లంతా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలా అన్నింట్లోనూ బెస్ట్ గా నిలిచిన వాళ్లకే బిగ్ బాస్ షోలో తమ జర్నీ కన్ఫామ్ అవుతుందని అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు ఇళ్ల మధ్యలో పద్మవ్యూహం అనే కాన్సెప్ట్ ను పెట్టారని అంటున్నారు. మొత్తానికి చివరగా మెయిన్ హౌస్ లో మిగిలిన కంటెస్టెంట్ విన్నర్ అవుతాడని చెబుతున్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు కానీ లోగో ఆధారంగా ఇలాగే ఉండబోతుందని ఊహిస్తున్నారు.

కంటెస్టెంట్స్ వీళ్లే?

కుమారి ఆంటీ, బర్రెలక్క, రీతు చౌదరి, క్రికెటర్ అంబటి రాయుడు, అమృత ప్రణయ్, విష్ణుప్రియ, హేమ, వేణు స్వామి, సురేఖవాణి, సోనియా సింగ్, బుల్లెట్ భాస్కర్, కిరాక్ ఆర్పి, బంచిక్ బబ్లు లాంటి వాళ్ళ పేర్లు ఈ సీజన్ లో వినిపిస్తున్నాయి. సీజన్ 8 సెప్టెంబర్ 8 ఆదివారం నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు