Bigg Boss 7: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేస్ ఫైల్..!

“అన్నా మళ్లొచ్చినా.. తెలుసు కదా మళ్లొచ్చినా అంటే తగ్గేదేలే.. నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తానన్నా.. నేను రైతు బిడ్డను అన్నా .. నన్ను బిగ్ బాస్ లోకి తీసుకోండి అన్నా.. ఈ వీడియో నాగార్జున వరకు చేరేలా షేర్ చేయండి అన్నా” అంటూ వందల కొద్దీ వీడియోలు చేసి చివరికి తాను ఆశపడినట్టుగానే రైతుబిడ్డ అనే ట్యాగ్ తో బిగ్ బాస్ సీజన్ 7లో అవకాశం దక్కించుకున్నాడు పల్లవి ప్రశాంత్.. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు అంటూ హౌస్ లోకి వచ్చి ప్రత్యర్థులతో పోరాడి టైటిల్ విన్నర్ గా నిలిచారు. కామన్ మ్యాన్ క్యాటగిరి లో హౌస్ లోకి వచ్చి టైటిల్ విజేతగా నిలవడం అంటే మామూలు విషయం కాదు. అయితే పల్లవి ప్రశాంత్ పక్కా ప్లానింగ్ తోనే హౌస్ లోకి అడుగు పెట్టాడని వార్తలు వినిపిస్తున్నాయి.

హౌస్ లోకి వెళ్లే ముందు పిఆర్ టీమ్ ను ఏర్పాటు చేసుకొని.. ఆ తర్వాతే హౌస్ లోకి వచ్చాడు అని.. ఇక వారే ఆయనను గెలిపించారు అంటూ వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం. అయితే తాజాగా పల్లవి ప్రశాంత్ పై కేసు ఫైల్ అయినట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే హౌస్ లోకి అడుగుపెట్టిన అప్పటినుంచి సీరియల్ నటుడు అమర్ దీప్ అలాగే పల్లవి ప్రశాంత్ మధ్య గొడవలు తారస్థాయికి చేరిన విషయం అందరికీ తెలిసిందే. ఇక హౌస్లో వీళ్ళిద్దరూ గొడవ పడుతుంటే బయట వీరిద్దరి అభిమానులు మరింతగా గొడవ పడుతూ ఇతర కంటెస్టెంట్లను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు

ఇక ఈనెల 17వ తేదీన గ్రాండ్ ఫినాలేలో విజేతను ప్రకటించిన తర్వాత పల్లవి ప్రశాంత్ అభిమానులు అమర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు అలాగే గీతూ రాయల్ , అశ్విని కార్లపై దాడికి పాల్పడి సైకోలా ప్రవర్తించారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట చాలా వైరల్ అవుతున్నాయి. అత్యుత్సాహంతో పల్లవి ప్రశాంత్ అభిమానులు ఇలా అమర్ దీప్ తో పాటు ఇతర సెలబ్రిటీలపై దాడులు చేయడంతో పల్లవి ప్రశాంత్ అలాగే ఆయన అభిమానులపై కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్తలు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

 

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు