BiggBoss 8 : ప్రాంతీయభిమానం చిచ్చు లేపిన కిరాక్ సీత.. కన్నడోళ్లను తెచ్చారేంటి అంటుంది!

BiggBoss 8 : బిగ్ బాస్ సీజన్ 8 మెల్లిమెల్లిగా ఆడియన్స్ లో ఆసక్తి పెంచుతుంది. తొలి రెండు రోజులు పెద్దగా ఆసక్తి కలిగించలేకపోయిన బిగ్ బాస్ షో ఆ తర్వాత ఓ టాస్క్ మొదలవగానే కంటెస్టెంట్ల మధ్య పోటీ వాతావరణం ఏర్పడింది. ఇక ఈ రియాలిటీ షో లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తమ ఆటతో ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ హౌస్ లో ముగ్గురు కంటెస్టెంట్స్ చీఫ్ లుగా ఎన్నికైన విషయం తెలిసిందే. నిఖిల్, నైనిక, యష్మి గౌడ (Yashmi gowda) హౌస్ చీఫ్ లుగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉండగా ఈ ముగ్గురి చీఫ్స్ ని వాళ్ళ క్లాన్ ని నిర్మించునేందుకు బిగ్ బాస్ టాస్క్ ని పెట్టాడన్న విషయం తెలిసిందే. ఆ టాస్క్ లో యష్మి గౌడ టీం గెలవగా, ఆ టీమ్ లోకి సోనియాని తీసుకుని టీమ్ ని స్ట్రాంగ్ చేసుకున్నారు.

Kirrak Seetha Sensational Comments in BiggBoss 8 House

ప్రాంతీయాభిమానం లేపిన కిర్రాక్ సీత..

ఇదిలా ఉండగా బిగ్ బాస్ (BiggBoss 8) హౌస్ లో కంటెస్టెంట్ అయిన కిరాక్ సీత కొత్త చిచ్చు పెట్టేలా ఉంది. అసలు విషయానికి వస్తే.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లలో ఎక్కువగా కన్నడ ప్రాంతానికి చెందిన కంటెస్టెంట్లు ఉన్న విషయం తెలిసిందే. యష్మి గౌడ, నిఖిల్, పృత్వి రాజ్ శెట్టి, ప్రేరణ (Prerana) ఇలా వీళ్ళందరూ బెంగుళూర్ నుండి వచ్చిన వాళ్ళు కాగా, బుల్లితెర సీరియల్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే ఈ సీజన్లో వీళ్ళు కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టగా తమదైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో ఓ టాస్క్ జరిగాక, బిగ్ బాస్ హౌస్ లో ఓ సందర్భంలో సరదాగా హౌస్ మేట్స్ తో కూర్చున్న సమయంలో.. కన్నడ బ్యాచ్‌ను ఉద్దేశిస్తూ కిర్రాక్ సీత సంచలన వ్యాఖ్యలు చేసింది.

- Advertisement -

కన్నాడోళ్లను తెచ్చారేంటి?

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ తో ఓ గదిలో కూర్చుని ఉన్న కిరాక్ సీత (Kirrak Seetha) ఓ సందర్భంలో ..”ఏంది బిగ్‌బాస్ ఈ కన్నడోళ్లు అందరినీ తెచ్చావ్” అంటూ సీత కామెంట్స్ చేస్తుంది. ఈ మాట అన్నప్పుడు పృథ్వీ, ప్రేరణ పక్కనే ఉండగా పెద్దగా పట్టించుకోలేదు. కానీ నామినేషన్స్ టైం లో ఈ విషయం లేపే ఛాన్స్ ఉంది. ఇది కిరాక్ సీత వ్యక్తిగత ప్రవర్తనపై నెగిటివ్ గా ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

అయితే సోషల్ మీడియాలో కిరాక్ సీత అన్న ఈ మాటపై నెగిటివ్ స్పందనే వస్తుంది. ప్రతి సంవత్సరం బిగ్ బాస్ హౌస్ లో అన్ని భాషలకు చెందిన కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. లాస్ట్ సీజన్లో శోభా శెట్టి, ప్రియాంక జైన్ లాంటి వాళ్ళు కన్నడ వాళ్ళే. ఇక బుల్లితెరపై కూడా చాలామంది కన్నడిగులు లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. అలాగే తెలుగు వాళ్ళు కూడా ఇతర భాషల్లో సినిమాల్లో సీరియల్స్ లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఈ క్రమంలో కిరాక్ సీత ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదని నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి. పైగా సీత కంటెస్టెంట్స్ తో ప్రతి చిన్న దానికి ఫైర్ అవుతూ ఉండడం వల్ల ట్రోలింగ్ కి గురవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు