Bigg Boss Telugu : బిగ్ బాస్ షో కు బుల్లితెరపై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ షో కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తెలుగులో ఇప్పటికే ఏడు సీజన్లను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎనిమిదోవ సీజన్ కోసం మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ఈ సీజన్ ప్రోమోను కూడా మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అయితే ఈ షోలో రాబోతున్న కంటెస్టెంట్స్ గురించి ఇంకా ఫైనల్ అవ్వలేదు కాదు. రోజుకో వార్త బయటకు వస్తుంది. తాజాగా మరో వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ షోలో వేణుస్వామి పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన షోలో పాల్గొనడం కష్టమని తెలుస్తుంది.
గత కొన్ని సీజన్ల నుంచి బిగ్ బాస్ లో కొత్త ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సీజన్ 8 విషయంలో మేకర్స్ కాస్త జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్థమవుతుంది. రీసెంట్ గా విడుదలైన ప్రమోలోనే ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ ప్రోమో పై ట్రోలింగ్ కూడా బాగానే జరుగుతుంది. ఎప్పుడూ ఏదోకటి కొత్తగా చెయ్యాలని క్యాప్షన్ ఇవ్వడం కామన్. ఈ సీజన్ కు కూడా సరికొత్తగా ట్యాగ్ ఇచ్చారు. దీనిపై బిగ్ బాస్ యాంటి ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ షోలో వేణు స్వామి ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్తపై ఘోరంగా కామెంట్స్ చేస్తున్నారు. నిన్న నాగ చైతన్య, శోభిత జాతకం పై ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల అతనిపై అరెస్ట్ వారెంట్ జారి అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఇష్యు సీరియస్ అవ్వడంతో ఇక ఆయన బిగ్ బాస్ గడప తొక్కడం కష్టమని తెలుస్తుంది. కేసు ఫైల్ అయితే అక్కడ ఉండనివ్వరు. ఇక ఆయన రాడని టాక్.
వేణుస్వామి గురించి చెప్పాలంటే.. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పై సంచలన వ్యాఖ్యలు చేసి చివరగా నా జాతకం తప్పు కావాలని కోరుకుంటున్నా అన్న వేణు స్వామి గతంలో ఏపీ ఎన్నికల సమయంలో జగన్ గెలుస్తాడని బల్ల గుద్ది మరీ చెప్పి, జగన్ ఓటమి పాలు కావటంతో ఆన్ లైన్ లో ఇంకెప్పుడూ జాతకాలు చెప్పను అన్నారు. తాజాగా నాగ చైతన్య ఎంగేజ్మెంట్ పై జ్యోక్యం చేసుకోవడం పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే వేణు స్వామికి బిగ్ బాస్ లో చోటు ఇవ్వకూడదనే డిమాండ్ కూడా ప్రధానంగా వినిపిస్తుంది. నాగార్జున ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న క్రమంలో నాగార్జున తనయుడు నాగ చైతన్య అక్కినేని పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వేణు స్వామికి అవకాశం ఇవ్వకూడదని నాగచైతన్య ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రాబోతుందని సమాచారం.