Bigg Boss 7 : సైకోల్లా మారిన ప్రశాంత్ ఫ్యాన్స్… ఇతర కంటెస్టెంట్స్ పై దాడి

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలే సక్సెస్ ఫుల్ గా పూర్తయింది. ముందుగానే లీక్ అయినట్టుగానే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ విన్నర్ గా నిలిచాడు. రాత్రి పది గంటల దాకా విన్నర్ ఎవరు అనే విషయంపై ఉత్కంఠత వీడలేదు. ఇక అప్పటిదాకా కన్నుల పండుగగా జరిగిన బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో పలువురు సినీ ప్రముఖులు కనిపిస్తూ ప్రేక్షకులను అలరించారు. ఇక చివరగా హౌస్ లో ఇద్దరు కంటెస్టెంట్స్ మిగలగా, అందులో అమర్దీప్ రన్నరప్ గా నిలిచాడు. పల్లవి ప్రశాంత్ మాత్రం విన్నర్ అయ్యాడు. అయితే ఇక్కడిదాకా అంతా బాగానే ఉంది కానీ ఆ తరువాతే మొదలైంది అసలు కథ. షో పూర్తయ్యాక ఈ కంటెస్టెంట్స్ ను చూడడానికి అన్నపూర్ణ స్టూడియోకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఇక వాళ్లను కంట్రోల్ చేయడానికి పోలీసులు ముప్పు తిప్పలు పడ్డారు. ఇదే అవకాశంగా భావించిన కొంతమంది ఆకతాయిలు స్టూడియో నుంచి బయటకు వస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై దాడి చేశారు. పైగా అక్కడ ఫ్యాన్ వర్క్ కూడా చోటు చేసుకోవడం గమనార్హం. మరి కంటెస్టెంట్స్ ఎవరెవరిపై దాడి జరిగింది? ఈ ఫ్యాన్స్ ఎందుకు సైకోల్లా మారారు? అనే వివరాల్లోకి వెళితే…

నిజానికి బిగ్ బాస్ షో స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి సీజన్లో గ్రాండ్ ఫినాలే తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బయట ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. అయితే కంటెస్టెంట్స్ పై దాడి జరగడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలే పూర్తయిన అనంతరం బయటకు వస్తున్న కంటెస్టెంట్స్ పై, వాళ్ల కార్లపై దాడి చేశారు. విన్నర్, రన్నరప్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్ జరిగింది. అమర్ కారు అద్దాలు పగలగొడుతూ మరి ఫోటోలు వీడియోలు తీసుకున్నారు కొంతమంది. అంతేకాకుండా అమర్ ను పచ్చి బూతులు తిట్టారు. ఈ వాగ్వాదంలో అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సులు సైతం వదలలేదు. దాని కారు అద్దాలను కూడా పగలగొట్టేశారు. ఇక అమర్ దీప్ తో పాటు ఇతర కంటెస్టెంట్స్ గీతు, అశ్వినిల విషయంలో కూడా ఇలాంటి దారుణమే జరిగింది. అశ్విని తన కారు అద్దాలను ఎలా పగలగొట్టారు అనే విషయాన్ని వెల్లడిస్తూ ఒక వీడియోను రిలీజ్ చేసింది. అందులో కష్టపడి కారు కొన్నానని, ఇంకా దానికి సంబంధించిన ఈఎంఐలు కట్టుకుంటున్నానని ఆవేదనను వ్యక్తం చేస్తూ ఫాన్స్ అయితే ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఫైర్ అయ్యింది. ఇక గీత అసలు వాళ్ళు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే కాదని, ఎవరో ఆకతాయిలు అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ఫ్యాన్ వార్ కు, అశ్విని కారు అద్దాలు పగిలిపోయాయంటూ షేర్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతానికి ఈ విషయంపై అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ఇంకా రియాక్ట్ కాలేదు. అయితే కంటెస్టెంట్స్ ప్రవర్తన నచ్చకపోతే ఎలాగూ సోషల్ మీడియా ద్వారా వాళ్లపై ద్వేషాన్ని చూపిస్తున్నారు. అది చాలదన్నట్టు ఇప్పుడు ఏకంగా వాళ్ళపై దాడి చేయడం ఏంటి అనే విషయం అందరిని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఆ వీడియోలను చూసిన నెటిజన్లు ఇంత దారుణంగా ప్రవర్తించిన ఆ సైకోలను వదలకూడదు అంటూ పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నారు.

- Advertisement -

 

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు