Bigg boss 8 : అందరూ ఊహించినట్టే శేఖర్ బాషా ఎంట్రీ.. అత్యధిక RJ మారథాన్ లు నిర్వహించిన ఏకైక ఇండియన్..

Bigg Boss 8 : బుల్లితెర ప్రియులు రోజులుగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ మళ్ళీ వచ్చేసింది. కింగ్ నాగార్జున (Nagarjuna) హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 8 నిన్న ప్రారంభమయింది. నెలరోజుల కిందే బిగ్ బాస్ సీజన్ 8 తొందర్లో వచ్చేస్తుందని ప్రోమోలతో ప్రమోషన్స్ చేయగా, ఫైనల్ గా సెప్టెంబర్ 1 నుండి బిగ్ బాస్ సీజన్ 8 రియాలిటీ షో మొదలైంది. ఇక మొదటి ఎపిసోడ్ లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇందులో పలు టీవీ సీరియల్స్ నటులు, సినిమా నటులతో పాటు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు.

ఇక బిగ్ బాస్ (Bigg Boss 8) లో ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ ని గమనిస్తే… సీరియల్ నటి యష్మి గౌడ మొదలు కొని వరుసగా… నటుడు నిఖిల్ మలియక్కల్, నటుడు అభయ్ నవీన్, హీరో ఆదిత్య ఓం, నటి సోనియా ఆకుల, ఇన్ఫ్లుయెన్సుర్ బెజవాడ బేబక్క, నటి కిరాక్ సీత, నటుడు నాగ మణికంఠ, నటుడు పృథ్వీరాజ్ శెట్టి, యాంకర్ విష్ణుప్రియ, డ్యాన్సర్ నైనిక , యూట్యుబర్ నబిల్ ఆఫ్రిది, నటి ప్రేరణ (Prerana) ఎంట్రీ ఇవ్వగా, ఆర్జే శేఖర్ బాషా కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

RJ Shekhar Basha Entry in Bigg Boss Season 8

- Advertisement -

అందరూ ఊహించినట్టే ఆర్జే శేఖర్ ఎంట్రీ..

ఇక బిగ్ బాస్ 8 షో లోకి ఎక్కువగా బుల్లితెర నటులు ఎంట్రీ అవ్వగా, రీసెంట్ గా కాంట్రవర్సీలతో ఫేమస్ అయిన ఆర్జే శేఖర్ బాషా (RJ Sekhar Basha) కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇతని ఎంట్రీ ఈ బిగ్ బాస్ సీజన్లో ఉంటుందని చాలా మంది ఊహించారు. రీసెంట్ గా రాజ్ తరుణ్ – లావణ్య ప్రేమ వ్యవహారం ఇండస్ట్రీలో ఎంత వైరల్ అయిందో తెలిసిందే. అందులో శేఖర్ బాషా కూడా ఈ కాంట్రవర్సీ లో భాగమయ్యాడు. ఈ క్రమంలో ప్రముఖ నటుడు, ఫేమస్ రేడియో జాకీ ఆర్జే శేఖర్ బాషా ఎంట్రీ ఇచ్చాడు. అయితే శేఖర్ బాషా అంటే ఒక రేడియో జాకీ అని, రాజ్ తరుణ్ – లావణ్య (Raj tarun – lavanya) లవ్ స్టోరీ తోనే వైరల్ అయ్యాడనే తెలుసు. కానీ అంతకు ముందే శేఖర్ బాషా టెలివిజన్ లో సుపరిచితుడు.

అత్యధిక RJ మారథాన్ లు నిర్వహించిన ఏకైక ఇండియన్..

ఇక శేఖర్ బాషా 2005లో జెమిని మ్యూజిక్ ఛానల్‌లో వీడియో జాకీగా కెరీర్ ప్రారంబించగా, ఆ తర్వాత 3000లకు పైగా లైవ్ షో లు చేశాడు. ‘హాయ్-బుజ్జి’ షో తో ఫేమస్ అయిన శేఖర్ ఆర్జేగా అంతకు మించి సక్సెస్ అయ్యాడు. ‘వెల్కమ్ ఒబామా’ అనే సినిమాతో నటుడిగానూ ఎంట్రీ ఇచ్చాడు. ఇక రేడియోలో అత్యధిక మారథాన్‌ లు నిర్వహించిన ఏకైక ఇండియన్‌ ఆర్జేగా శేఖర్ బాషా రికార్డు సాధించాడు. అంతేకాదు ఆర్జే గా ఏకంగా 18 అవార్డులు అందుకుని అందరి కంటే ఎక్కువ ఐఆర్ఎఫ్‌ లను గెలుచుకున్న ఆర్జేగానూ నిలిచాడు. ఇప్పుడు రాజ్ తరుణ్ – లావణ్య వివాదంతో ఎక్కువ వార్తల్లో నిలిచి మరోసారి వార్తల్లో నిలిచాడు. ఫైనల్ గా బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చాడు. మరి సీజన్ 8 లో తన ఆటతీరుతో ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు