Biggboss house: బిగ్ బాస్ హౌస్ లో వరుస హత్యలు.. ఫస్ట్ టైం ఇంట్రెస్ట్ లేదంటూ ట్రోలింగ్!

బిగ్ బాస్ సీజన్ 7 మరో మూడు వారాల్లో ముగియనుండగా, ఈ వారం ఏ కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అవ్వలేదన్న విషయం తెలిసిందే. అయితే ఇదే విషయాన్నీ నాగార్జున చెప్తూ నెక్స్ట్ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే ఈ బిగ్ బాస్ హౌస్ లో రెండు రోజులుగా బిగ్ బాస్ మిస్సెస్ బిగ్ బాస్ హత్యకి గురయింది అంటూ ఓ సీక్రెట్ టాస్క్ ని పెట్టడం జరిగింది. ఈ టాస్క్ లో అర్జున్, అమర్ లని పోలీస్ లుగా డిసైడ్ చేయగా, మిగతా హౌస్ మేట్స్ ని హోటల్ స్టాఫ్ గా నియమించారు.

అయితే ఈ టాస్క్ మొదలైనపుడు బాగానే ఉన్నా, ఆడియన్స్ కి అర్ధమయ్యేట్టు, హౌస్ మేట్స్ కి కూడా తమ తమ పాత్రల గురించి చెప్పినా, డ్రామా లో పస లేదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ టాస్క్ మొదలైనపుడు, బిగ్ బాస్ శివాజీని విలన్ గా అంటే హత్య చేసిన వ్యక్తి గా, అలాగే హోటల్ మేనేజర్ గా రెండు షేడ్స్ ఉన్న పాత్ర ఇచ్చారు.

ఇక శివాజీ ఫస్ట్ ప్రశాంత్ ని హత్య చేయగా, ఆ వెంటనే అశ్విని ని కూడా హత్య చేసినట్టు సీన్ ని రక్తి కట్టించే ప్రయత్నం చేసారు. కంటెస్టెంట్స్ వాళ్ళ వరకు యాక్టింగ్ బాగానే చేస్తున్నా, ఆడియన్స్ కి ఈ డ్రామా పై అంతగా ఇంట్రెస్ట్ కలగడం లేదన్నది వాస్తవం. ఎందుకంటే ఈ టాస్క్ లో ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతుంది, పైగా ఇదేమి ఫిజికల్ టాస్క్ కూడా కాదు, అందుకే సోషల్ మీడియాలో ఈ టాస్క్ పై ట్రోలింగ్ జరుగుతుంది. ఇంతకు ముందు వచ్చిన టాస్కుల్లో కంటెస్టెంట్స్ కరెక్ట్ గా ఆడలేదనో, లేక వేరే వాళ్ళకి అన్యాయం జరిగిందనో ట్రోల్ చేసేవారు. కానీ ఫస్ట్ టైం అసలు టాస్కె బాగాలేదని ట్రోలింగ్ జరుగుతుంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు