మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇటీవల తెలుగులో రెండో సినిమా చేసిన సంగతి తెలిసిందే. లవ్ స్టోరీలు తెరకెక్కించే హను రాఘవపూడి దర్శకత్వంలో దల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. వైజయంతి బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగ ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా ఆగస్టు 5న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడులైంది.
తొలి రోజు నుండే మంచి టాక్ తెచ్చుకోవడంతో సీతారామం బ్లాక్ బస్టర్ అని తెలిపోయింది. కలెక్షన్లు కూడా భారీగా వచ్చాయి. ఆగస్టు నెలలో సీతారామం సినిమాతో టాలీవుడ్ కు శుభారాంభం వచ్చింది. దీని తర్వాత బింబిసార సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయినా, దాని పోటీని తట్టుకుని థియేటర్ లలో నిలిచింది. దీంతో కలెక్షన్లు కూడా భారీగా పెరిగాయి. తాజాగా ఈ చిత్రం 75 కోట్లను వసూళ్లు చేసింది.
తమ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 75 కోట్లను వసూళ్లు చేసిందని చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను విడుదల చేసి అధికారికంగా ప్రకటించిది. అయితే సీతారామం ఒక అమెరికాలోనే 1.3 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది. దీంతో సీతారమం 75 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.
Thank you for all the love pouring in for #SitaRamam 🦋💖@dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @hanurpudi @AshwiniDuttCh @TharunBhasckerD @vennelakishore @Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth @penmovies @DQsWayfarerFilm @LycaProductions pic.twitter.com/jI2BoTO15k
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 27, 2022