Aishwarya Rai : ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకోబోతున్న ఐశ్వర్య రాయ్

Aishwarya Rai : ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ బచ్చన్ 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసి అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అయితే ఆమె చేతికి కట్టుతో కన్పించడం మాత్రం అందరినీ కాస్త ఆందోళనకు గురి చేసింది. భారత్‌కు తిరిగి వచ్చిన వెంటనే సర్జరీ చేయించుకోబోతున్నట్టు సమాచారం. మరి అసలు ఐశ్వర్యకు ఆ గాయం ఎలా తగిలింది? ఐశ్వర్యరాయ్ ఆరోగ్య సమస్య ఉన్నప్పటికీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎందుకు వెళ్లింది? తిరిగి వచ్చాక ఆమె చేసుకోబోయే సర్జరీ ఏంటి? అంటే ఇదిగో సమాధానం.

ఇండియాకు తిరిగి రాగానే సర్జరీ

ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఈ ఏడాది చేతికి బ్యాండేజ్ వేసుకుని మరీ కేన్స్ కోసం ఫ్రాన్స్ వెళ్ళింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన కూతురు సహాయంతో రెడ్ కార్పెట్ పై మెరిసి అందరినీ అట్రాక్ట్ చేసింది. అయితే ఈసారి ఆమె ధరించిన డ్రెస్ లపై విమర్శలు వచ్చాయి. అది వేరే విషయం అనుకోండి. ఇక ఐష్ కుడి చేతికి బ్యాండేజీ ఉండడం చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అసలు ఆమె చేతికి ఎలా గాయమైంది అని ఆరా తీయడం మొదలు పెట్టారు. మరోవైపు అలా గాయమైనా ఆమె పట్టుదలగా 77వ కేన్స్ లో పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు ఐశ్వర్యరాయ్ ఇండియా తిరిగి వచ్చిన వెంటనే చేతికి సర్జరీ చేయించుకోనుందని సమాచారం.

21 ఏళ్లుగా కేన్స్ లో క్వీన్ ఐశ్వర్య

ఐశ్వర్యరాయ్ బచ్చన్ వరుసగా 21 సంవత్సరాలుగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొంటోంది. ఆమె డిఫరెంట్ కాస్ట్యూమ్స్‌లో కనిపించడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఏడాది ఆమెకు తీవ్రమైన చేతి నొప్పి కారణంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై అడుగు పెట్టడం అనుమానమే అని టాక్ నడిచింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అంత నొప్పి ఉన్నా కేన్స్ లో మెరిసింది ఐశ్వర్య.

- Advertisement -

ఐష్ కి ఏమైంది?

కొన్ని రోజుల క్రితం ఐశ్వర్యరాయ్ బచ్చన్ మణికట్టుకు గాయమైంది. నొప్పి కారణంగా ఈసారి కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు వెళ్లవద్దని బంధువులు కూడా సలహా ఇచ్చారు. కానీ ఐశ్వర్యరాయ్ అందుకు అంగీకరించలేదు. ఎంతో గ్రాండ్ గా జరగనున్న వేడుకను ఈసారి మిస్ చేయకూడదనుకుంది. అందుకే చేతికి కట్టు కట్టుకుని మరీ రెడ్ కార్పెట్ పై ఫోజులిచ్చింది. రెండు రోజులు రెండు డ్రెస్ లలో కేన్స్ లో కన్పించింది ఈ ప్రపంచ సుందరి.

మణికట్టుకు ఆపరేషన్

ఐశ్వర్యరాయ్ బచ్చన్ విదేశాలకు వెళ్లే ముందు తన వైద్యుల బృందంతో చర్చించారు. వచ్చే వారం భారత్‌కు తిరిగి రాగానే ఆమె మణికట్టుకు వైద్యులు సర్జరీ చేయనున్నట్లు ఐష్ సమీప బంధువు ఒకరు చెప్పినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. దీంతో ఇప్పటి నుంచే ఐష్ అభిమానులు ఆమె త్వరగా ఆ గాయం నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కాగా కూతురు ఆరాధ్య బచ్చన్‌తో కలిసి ఐశ్వర్య కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి వెళ్లింది. ప్రస్తుతం ఆమె కేన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు