Nagarjuna : చీఫ్ గెస్టులు అక్కినేని హీరోలే

అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘ది ఘోస్ట్’. సినిమాలో గోస్ట్ లో నాగ్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ది గోస్ట్ మూవీని అక్టోబర్ 5న విడుదల చేస్తున్నారు. పి.ఎస్.వి గరుడవేగ సినిమా తరువాత ఆ రేంజ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ప్రవీణ్ సత్తారు, ది ఘోస్ట్ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇప్పుడు ఈ చిత్రం రిలీజ్ కి దగ్గర పడుతుండగా మేకర్స్ గ్రాండ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి గాను సిద్ధం చేస్తున్నారు. ఈ సెప్టెంబర్ 25న ఈ ఈవెంట్ ని ఫిక్స్ చెయ్యగా దీనిపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చేసింది. ఈ ఈవెంట్ కి గాను స్పెషల్ గెస్ట్ లుగా అక్కినేని యంగ్ హీరోలే వస్తున్నారట.

అంటే ఈ ఈవెంట్ లో అక్కినేని నాగార్జున తో, అక్కినేని నాగచైతన్య మరియు అక్కినేని అఖిల్ కూడా మెరుస్తారట. దీనిపై తాజాగా అధికారిక ప్రకటన చేసింది చిత్ర బృందం. ఈ మేరకు తండ్రి కొడుకులతో కూడిన పోస్టర్‌ ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. దీంతో అక్కినేని ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు