దర్శకుడు మోహన్రాజా ఇప్పుడు అందరికీ సుపరిచితమే. ఎందుకంటే ఆయన మెగాస్టార్ చిరంజీవితో గాడ్ఫాదర్ సినిమాకి దర్శకత్వం వహించాడనే విషయం తెలిసిందే. ఆయన పుట్టింది, పెరిగింది తమిళనాడులో అయినప్పటికీ ఆయన దర్శకునిగా పుట్టింది మాత్రం తెలుగులోనే అని గర్వంగా చెప్పుకుంటాడు మోహన్రాజా. తొలుత మోహన్రాజా తెలుగులో హనుమాన్ జంక్షన్ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇక ఆ తరువాత తమిళంలో పలు సినిమాలను రీమెక్లు చేసి సూపర్ హిట్ సాధించాడు. ఈ నేపథ్యంలో లూసిఫర్ రీమెక్ చేసి గాడ్ఫాదర్ తో మరో హిట్ సాధించాడు.
ఇక మరోవైపు అక్కినేని నాగార్జున, అకిల్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ మూవీ రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారట దర్శకుడు మోహన్ రాజా. ప్రస్తుతం ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారట. ఈ మధ్యకాలంలో వరుస యాక్షన్ సినిమాలతో బిజీగా ఉన్న నాగార్జున చిన్న బ్రేక్ తరువాత ఈ సినిమాను ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
ఇక ఈ లోపు అక్కినేని అఖిల్ కూడా తన తాజా చిత్రం ఏజెంట్ని దాదాపు పూర్తి చేసేస్తారట. ఆ తరువాత తండ్రి నాగార్జునతో కలిసి చేయనున్న సినిమా సెట్స్లో అడుగుపెడతారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రం నాగార్జున కెరీర్లో 100వ చిత్రం అని టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.