Allari Naresh: గెస్ట్ రోల్‌లో మరోసారి..

అల్లరి నరేష్ టాలీవుడ్ కామెడీ స్టార్ గా అందరికీ సుపరిచితమే. “అల్లరి” సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ సినిమా పేరుని తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు ఈ హీరో. తెలుగు ఇండస్ట్రీలో ఈ జనరేషన్ కామెడీ సినిమాలకి అల్లరి నరేష్ కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. కితకితలు మూవీతో తన సత్తా ఏంటో తెలుగు ఆడియన్స్ కి చూపించాడు ఈ హీరో.

ప్రముఖ దర్శకుడు తనయుడు అయినప్పటికీ తన ఓన్ టాలెంట్ తో కామెడీ సినిమాలతో తన మార్కుని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సెట్ చేసుకున్నాడు నరేష్. అల్లరి నరేష్ తన కెరీర్ లో నాంది సినిమా తర్వాత ట్రాక్ మార్చి సీరియస్ సినిమాల వైపు దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆయన నటించిన ‘ఉగ్రం’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఇక తాజాగా మరోసారి నరేష్ అతిధి పాత్రకు అంగీకరించినట్లు తెలుస్తున్నది.

నాగార్జున హీరోగా రచయిత ప్రసన్నకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ధమాకా విజయంతో ఈ రచయిత మంచిపేరు తెచ్చుకున్నారు. వీరి కాంబోలో తెరకెక్కే సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఉండనుంది. 80 దశకంలో సాగే కథతో రూపొందే ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రకు అల్లరి నరేష్ ను ఎంచుకున్నారట.

- Advertisement -

ఇక ఈ సినిమాలో మరో గెస్ట్ రోల్ లో యువ హీరో రాజ్ తరుణ్ నటిస్తారని సమాచారం. ‘ఘోస్ట్’ సినిమా తర్వాత నాగార్జున కొంత విరామం తీసుకుని చేస్తున్న చిత్రం ఇదే. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువలనుంది. కాగా నరేష్ ఉగ్రం చిత్రాన్ని మే 5న ప్రేక్షకుల ముందు తీసుకురాబోతున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు