Chiranjeevi: చిరు సినిమాలో తనకంటే ఆయనకే రెమ్యునరేషన్ ఎక్కువా..?

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి సినిమా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ వచ్చిన తర్వాత వరుస సినిమాలు ప్రకటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే..ఈ క్రమంలోనే గత ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈయన ఆ తర్వాత రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాని చేసి డిజాస్టర్ ను మూటగట్టుకున్నారు 2023 ఆగస్టు లో భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా విడుదలై డిజాస్టర్ టాక్ ను తెచ్చుకుంది.. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి విశ్వంభర అనే ఒక భారీ ఫాంటసీ చిత్రాన్ని చేస్తున్నారు.. దీనికి యువ దర్శకుడు వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది.. ఈ సినిమా 2025 జనవరి 10వ తేదీన విడుదల కానుంది అని చిత్ర బృందం అధికారికంగా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.. భారీ గ్రాఫిక్స్ తో వస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.. అంతేకాదు ఆస్కార్ గ్రహీత ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తూ ఉండడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి..

అంతేకాదు ఈ సినిమా కోసం చిరంజీవి భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పటివరకు ఆయన సినీ కెరియర్లో కేవలం రూ.50 నుంచీ రూ.60 కోట్లకు మాత్రమే తన రెమ్యూనరేషన్ ను పరిమితం చేయగా.. కానీ విశ్వంభర కోసం ఏకంగా రూ.100 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారట…అంతేకాదు ఇందుకు సంబంధించిన ఒక రూమర్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అంతేకాదు రూ.100 కోట్ల పారితోషకంలో కొంత ఏరియా రైట్స్ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.. ఇక త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా చిరంజీవి గతంలో నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో విలన్ గా అమ్రిష్ పురి నటించిన విషయం తెలిసిందే. రూ .3కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ 15 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.. అయితే ఈ సినిమా కోసం చిరంజీవి కేవలం రూ.50 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటే.. అదే సినిమాలో విలన్ క్యారెక్టర్ లో నటించిన అమ్రిష్ పురి మాత్రం ఏకంగా రూ.70 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నారట.. ఇందుకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. చిరంజీవి నటించిన సినిమాలో చిరంజీవి కంటే ఎక్కువ విలన్ కి రెమ్యునరేషన్ ఇవ్వడంతో ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది.. ఏది ఏమైనా అమ్రిష్ పురి లాంటి విలక్షణ నటుడు ఆ మాత్రం పారితోషకం తీసుకోవడంలో తప్పు లేదంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

ఇక విశ్వంభర సినిమా విషయానికి వస్తే.. చోటా కె నాయుడు ఫోటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ సురభి కీలక పాత్రలో నటించనుంది.. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి తో సినిమా చేయనున్నట్లు సమాచారం.. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని.. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.. ఇకపోతే ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనింగ్ గా ఉంటుందని.. దీనిని దిల్ రాజు నిర్మించబోతున్నారని సమాచారం.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు