Tollywood: రాజమౌళి బాటలో మరో దర్శకుడు..!

బాహుబలి సినిమా తర్వాత చాలా మంది దర్శకుల ఆలోచనా తీరు మారింది. రాజమౌళి బాహుబలి సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించి టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలకు కొత్త రూట్ చూపించారు. బాహుబలి స్పూర్తితో కేజీఎఫ్ లాంటి సినిమాలు రెండు భాగాలుగా రిలీజ్ చేసి సక్సెస్ అయ్యారు మేకర్స్. ఇటీవల పీఎస్ 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో దర్శకుడు మణిరత్నం కూడా ఈ సినిమా చేయటానికి రాజమౌళి స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. ఈ రూట్లో మరో దర్శకుడు సినిమా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఫీల్ గుడ్ సినిమాలకు ప్రసిద్ధి చెందిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కూడా తన నెక్స్ట్ సినిమాను రెండు భాగాలుగా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట.

బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న శ్రీకాంత్ అడ్డాల వెంకటేష్ తో అసురన్ సినిమాకు రీమేక్ గా నారప్ప సినిమా చేసి అందరిని ఆశ్చర్య పరిచాడు. అప్పటిదాకా ఫీల్ గుడ్ సినిమాలకే పరిమితం అయిన రేలంగి మామయ్య నారప్ప లాంటి ‘రా’ సినిమా చేసి సక్సెస్ అందుకొని తనలోని మాస్ యాంగిల్ ని పరిచయం చేసాడు. లొక్డౌన్ సమయంలో ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి ఫ్యామిలీకి చెందిన అబ్బాయిని  హీరోగా పరిచయం చేస్తూ పెద్దకాపు అనే సినిమా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. 1980ల నాటి పరిస్థితుల బ్యాక్డ్రాప్ లో రూపొందనున్న ఈ సినిమాతో శ్రీకాంత్ అడ్డాల కామ్ బ్యాక్ ఇస్తాడని అతని సన్నిహితులు నమ్మకంగా ఉన్నారట. బాహుబలి తర్వాత రాజమౌళి నుండి స్ఫూర్తి పొంది చాలా మంది దర్శకులు సక్సెస్ అయిన క్రమంలో శ్రీకాంత్ అడ్డాల కూడా విజయాన్ని అందుకుంటాడా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు