Bellamkonda Sai Sreenivas : ఒక్కటి పని అవ్వడం లేదు.. అందుకే “దశావతారం”

Bellamkonda Sai Sreenivas : బెల్లంకొండ సాయి శ్రీనివాస్… ఇప్పటి వరకు 8 సినిమాలు. ఓ బాలీవుడ్ సినిమా. అయినా, సక్సెస్ అనే మాటకు కిలోమీటర్ల దూరం ఉన్నాడు ఈ యంగ్ హీరో. తండ్రి నిర్మాత అవ్వడం వల్లో.. లేక స్టోరీ డిమాండ్ చేస్తుందో తెలీదు కానీ, ఈయన చేసే సినిమాల్లో అందరూ స్టార్ హీరోయిన్లే ఉంటారు. మొదటి సినిమాలోనే సమంతతో స్క్రీన్ షేర్ చేసుకున్నా… హిట్ కొట్టలేకపోయాడు. తర్వాత రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్, అనుపమ పరమేశ్వరన్ తో పాటు బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ భరుచ్చా తో రొమాన్స్ చేసినా, హిట్ పడలేదు.

అయినట్టు టాక్ ఉంది. ఈ సినిమా పురాణాలను టచ్ చేసేలా ఉంటుందట. సినిమా మెయిన్ పాయింట్… దశావతారాల గురించి ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటి వరకు తెలుగు సినిమాలేవీ కూడా ఈ కాన్సెప్ట్ ను టచ్ చేయలేదు.

ఇటీవల నాగ్ అశ్విన్ కల్కి 2898 AD అనే సినిమా చేసి పదో అవతారం కల్కి గురించి సినిమాలో చెప్పాడు. అయితే ఈ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలో దశావతారాల గురించి ఎక్స్ ప్లేన్ చేసేలా ఉంటుందని సమాచారం. 400 ఏళ్ల నాటి ఓ పూరాతన ఆలయం చుట్టు సినిమా సాగుతుందని కూడా టాక్ ఉంది. అక్కడే ఈ దశావతారాల గురించి స్టార్ట్ అవుతుందని, డైరెక్టర్ అలా స్టోరీని రెడీ చేసుకున్నట్టు తెలుస్తుంది. అందు కోసం హైదరాబాద్ శివారులో ఆ పూరాతన గుడి కోసం ఆర్ట్ డైరెక్టర్లు పని చేస్తున్నారట. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

- Advertisement -

ఇప్పటికే 9 సినిమాలు చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు ఈ దశావతారం కాన్సెప్ట్ అయినా హిట్ ని ఇస్తుందో లేదో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు