Bellamkonda Srinivas : బెల్లంకొండ నెక్స్ట్ మూవీకి ముహూర్తం ఖరారు… షూటింగ్ ఎప్పుడంటే?

Bellamkonda Srinivas : గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఆయన చేతిలో పలు కొత్త సినిమాలు ఉండగా, ఈ నెలలోనే మరో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనే వివరాల్లోకి వెళ్తే…

షూటింగ్ అప్డేట్ లీక్

వరుస సినిమాలతో బిజీగా ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే ఓ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నాడు అంటూ గత కొంతకాలంగా రూమర్లు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. మరో యంగ్ హీరో నారా రోహిత్ తో కలిసి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారని, ఈ మూవీ ఆగస్టు ఫస్ట్ వీక్ లో అధికారికంగా లాంచ్ అవుతుందని వార్తలు వినిపించాయి. ఈ సినిమాకు నాంది ఫేమ్ విజయ్ కనకమేడల  దర్శకత్వం వహిస్తున్నట్టుగా టాక్ నడిచింది. ఇక ఈ మల్టీస్టారర్ సినిమాను ప్రముఖ నిర్మాత కేకే రాధా మోహన్ నిర్మించబోతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టు గురించి తాజాగా ఓ అప్డేట్ బయటకు వచ్చింది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ మూవీ ఓపెనింగ్ ఆగస్టు 9న జరగబోతుందని, అధికారికంగా ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ఆరోజున మొదలుపెట్టబోతున్నారని భోగట్టా.

ఇక హిట్ అనే పదాన్ని మరిచిపోయి అల్లాడిపోతున్న తరుణంలో అల్లరి నరేష్ కు నాంది అనే ఓ బ్లాక్ పోస్టర్ మూవీని ఇచ్చి దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నాడు డైరెక్టర్ విజయ్ కనకమేడల. అందుకే ప్రస్తుతం ఆయన చేయబోతున్న ఈ మూవీపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. మరో ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే ఇందులో మంచు మనోజ్ కూడా నటించబోతున్నాడని తెలుస్తోంది.

- Advertisement -

rspnetwork.in: Bellamkonda Srinivas, Santosh Srinivas Film Grand Launch On 29th

తమిళ మూవీ రీమేక్

బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కలిసి చేయబోతున్న ఈ మూవీ ఓ తమిళ సినిమాకు రీమేక్ అనే వార్త జోరుగా వైరల్ అవుతుంది. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన గరుడన్ సినిమాను తెలుగులో గరుడ అనే పేరుతో రీమేక్ చేయబోతున్నారని అంటున్నారు. ఈ తమిళ సినిమాకు తమిళంలో దొరై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించగా, వెట్రిమారన్ కథ అందించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు. గరుడ స్టోరీ విషయానికి వస్తే.. ఇదొక ముగ్గురు స్నేహితుల మధ్య నడిచే కథ. అయితే ఈ స్నేహితుల్లో ఎవరు ఎవరిపై ఎందుకు ప్రతీకారం తీర్చుకున్నారు అనేదే స్టోరీ. తమిళంలో ఉన్ని ముకుందన్, శశికుమార్, సూరి ఈ రా అండ్ రస్టిక్ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. ఇదే స్టోరీని తెలుగు ప్రేక్షకుల కోసం పలు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది.

బెల్లంకొండ లైన్లో పెట్టిన సినిమాలు

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగలపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. BSS11 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. మరోవైపు టైసన్ నాయుడు అనే సినిమాను కూడా చేస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు